Ec announces 5 phase polls for jk and jharkhand counting on dec 23

Election Commission, announcement, dates, assembly elections, Jammu and Kashmir, Jharkhand, five phase, counting, polling dates, december 23

EC announces 5-phase polls for JK and Jharkhand, counting on Dec 23

జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలకు మ్రోగిన నగరా..!

Posted: 10/25/2014 07:29 PM IST
Ec announces 5 phase polls for jk and jharkhand counting on dec 23

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలను నిర్వహించిన కొద్ది కాలంలోనే మరో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మ్రోగించింది కేంద్ర ఎన్నికల సంఘం. జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ షెడ్యూలు విడుదల చేశారు. ఐదు విడతలుగా రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు, జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని 87 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు నవంబర్ 25వ తేదీ నుంచి మొదలవుతాయి. నవంబర్ 25న తోలిదశ, డిసెంబర్ 2న రెండోదశ, డిసెంబర్ 9 మూడవ దశ, డిసెంబర్ 14 నాల్గవ ధశ,  డిసెంబర్ 20 ఐదవ దశతో ఎన్నికల పోలింగ్ ముగస్తుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల డిసెంబర్ 23న చేపట్టనున్నట్లు చెప్పారు. .

వీటితో పాటు ఢిల్లీ అసెంబ్లీలోని మెహరోలి, తుగ్లకాబాద్, కృష్ణానగర్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇవి జమ్ము కాశ్మీర్ తొలిదశతో పాటు జరుగుతాయని వివరించారు.  రెండు రాష్ట్రాల్లోను నోటాకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. జమ్ము కాశ్మీర్లో మొత్తం 10,050 పోలింగ్ కేంద్రాలుంటాయి. జార్ఖండ్ లో మొత్తం 24,648 పోలింగ్ కేంద్రాలుంటాయని కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ విఎస్ సంపత్  వివరించారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more