ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఉన్న ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి సాగనంపుతున్నాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. అయితే జంపింగ్ లతో రాజకీయంగా ఏర్పడే అల్లకల్లోలాన్ని తనకు అనుకూలంగా కూడా మార్చుకోవటంలో కూడా జగన్ విఫలం అవుతూనే ఉన్నాడు. అది ఎలాగంటే... అధికార పక్షంలో ఇప్పుడున్న నేతల్లో దాదాపు 30 శాతం ఈ మూడేళ్లలో ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చినవారే. అలా వచ్చిన వాళ్లను నిలబెట్టుకోవటంలో చంద్రబాబు తడబాటుకు గురవుతుంటే, ఆ అడ్వాంటేజ్ ను జగన్ సరిగ్గా వాడుకోలేకపోతున్నాడనే టాక్ ఉంది.
ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ తర్వాత టీడీపీలో సీనియర్ల ముసలంతో ఓ ప్రతిష్టంబన టీకప్పులో తుఫాన్ లా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అంతా చల్లబడ్డప్పటికీ ఏ హామీ దొరకకపోవటంతో గుర్రుగా ఉన్నారు నెల్లూరు సీనియర్ నేతలు ఆనం బ్రదర్స్. 15 నెలలు గడుస్తున్నా ఇంత వరకు చిన్న పదవి కూడా దక్కించుకోలేకపోయిన ఆనం బ్రదర్స్.. పైగా స్థానిక నేతలతో వివాద సమయంలో అధిష్టానం, అది కూడా లోకేష్ నుంచి పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? అన్న రేంజ్ లో వార్నింగ్ తీసుకున్నారు. ఆ ఉదంతం తర్వాత ఎక్కడా టీడీపీ నిర్వహిస్తున్న పనుల్లో యాక్టివ్ గా కనిపించలేదు.
జిల్లాలో బలమైన నేతలుగా పేరుబడ్డ తాము తిరిగి పార్టీలోకి వస్తే కనీస మర్యాద ఇవ్వకపోవటం, పెద్దగా రాజకీయ అనుభవం లేని లోకేష్ ముందు తమను దోషిగా నిలబెట్టడం, సొమిరెడ్డికి పదవి ఇవ్వటం సహజంగానే వారికి ఆగ్రహాం తెప్పించింది. ఈ నేపథ్యంలో వాళ్లు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని పరిణామాలు హింట్ ఇస్తున్నాయి. తీవ్ర అసంతృప్తిలో ఉన్న వాళ్లను వైకాపా లో చేర్చుకోవాలన్నది జగన్ ఫ్లాన్ గా అర్థమౌతోంది. ఇందుకోసం కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దించగా, రెండు రోజుల క్రితం వాళ్ల మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు భోగట్టా.
టీడీపీ నుంచి వాళ్లను లాగితే మాత్రం నెల్లూరులో మరింత బలపడటం ఖాయమనే యోచనలో జగన్ ఉన్నాడు. అయితే విషయంలో ఇటు జగన్ గూటి నుంచి, అటు ఆనం వైపు నుంచి ఎలాంటి గుసగుసలు వినిపించటం లేదు. మరోపక్క ఛాన్స్ దొరికితే జగన్ పై ఓ రేంజ్ లో చిందులేసే ఆనం బ్రదర్స్ ని జగన్ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వడనే కొందరు చెబుతున్నారు. అయినా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా!
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more