రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ మైనింగ్ ని అడ్డుకోవటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర గిరిజన సంక్షేమ వ్యవహారాల మంత్రి కిషోర్ చంద్ర దేవ్ మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించటమే కాకుండా బడాబాబులు అడవిలో నివసించే గిరిజనుల జీవన శైలిలో అంతరాయం కలిగిస్తున్నారంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తంచేసారు.
షెడ్యూల్ 5 ప్రాంతాల్లో మైనింగ్ హక్కులను రాష్ట్రప్రభుత్వం ఎమ్ఓయూల ద్వారా గిరిజనేతరులకు ప్రసాదించటం వలన అవినీతికి చోటిస్తూ, శాంతిభద్రతల విఘాతానికి దోహదం చేస్తోందని ఆయన అన్నారు.
అలాంటి ఎమ్ఓయూలు పార్లమెంటు నుంచి కానీ శాసనసభ నుంచి కానీ వెలువడిన శాసనాలు కావు కాబట్టి, అవి కేవలం రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందమే అవటం వలన, గిరిజనుల సంక్షేమం దృష్ట్యా, భారత రాజ్యాంగంలోని ఆర్టికిల్ 244 ఇచ్చిన అధికారాలను వినియోగించుకుంటూ గవర్నర్ లు అటువంటి ఒప్పందాలను రద్దు చేయవచ్చునని సూచిస్తూ, వెంటనే సముచిత చర్య తీసుకోవలసిందిగా కోరుతూ కిషోర్ చంద్ర దేవ్, అన్ని రాష్ట్ర గవర్నర్లకూ లేఖలను పంపించారు.
ఏజెన్సీ లైన షెడ్యూల్ 5 ప్రాంతాలలో దృష్టి సారించకుండా అధికారంలో ఉన్నవారంతా అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను విస్మరించటానికి కారణం, వారంతా నగరవాసులు కాబట్టి అంటూ కిషోర్ చంద్రదేవ్ విమర్శిస్తూ, అందుకు పరిష్కారంగా సత్వర చర్యలను తీసుకుని ఆ తర్వాత రాటిఫికేషన్ కోసం రాష్ట్రపతికి పంపించవచ్చునని కూడా ఆయన గవర్నర్లకు సూచించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more