ప్రత్యేక తెలంగాణ కోసం మేమం రాజీనామాలు చేయటానికి సిద్దమే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జేబులో ఒక గులాబీ పువ్వు పెట్టుకొని ఢిల్లీకి వెళ్లటం జరిగింది. ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లిన గులాభీ పువ్వులు వారి పాదల వద్ద ఉంచి రాజీనామాల విషయం చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ కోసమే మా రాజీనామాలు అని బల్ల గుద్ది చెప్పినట్లు సమాచారం. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం వారి తెచ్చిన గులాబీలను తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో చెవుల్లో పెట్టి, మేము చెప్పితే జాగ్రత్తగా వినండి? అంటూ ఏడుగురు ఎంపీలకు ఢిల్లీలో హితబోత చేసినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ పెద్దల వెనకు సీమాంద్ర నాయకుడి హస్తం ఉందని తెలంగాణ వాదులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎవరికివారే యముణతీరే అనే విధంగా ఉన్నారు. తెలంగాణా విషయంలో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు స్పందిస్తున్న తీరు విచిత్రంగా ఉంది. తెలంగాణాపై కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా లేకుంటే ఆ పార్టీలో ఉండలేమని చెబుతూనే తాము చేసిన రాజీనామాలను అధిష్టానం ఆమోదించేవరకూ కాంగ్రెస్లోనే కొనసాగుతామంటున్నారు.
ఢిల్లీలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు మాజీ ఎంపీ కేశవరావు ఇంట్లో జరిగిన సమావేశానికి వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాత్రమే హాజరయ్యారు. గుత్తా సుఖేందర్రెడ్డి, పొన్నం ప్రభాకర్ నియోజకర్గాల్లోని కార్యక్రమాలకు హాజరైనట్లు నేతలు తెలిపారు. వారితో విభేదించిన మధుయాష్కీ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా కెకెతో పాటు ముగ్గురు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఇందులోనూ యాష్కీ పట్ల వేర్వేరుగా స్పందించారు. ముందుగా కేశవరావు మాట్లాడుతూ ఎంపీల రాజీనామాల్లో రాజీ లేదన్నారు. వారంతా చిత్తశు ద్ధితోనే రాజీనామా చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకునే పరిస్థితి ఉండదన్నారు. కాంగ్రెస్లోనే ఉంటూ తెలంగాణా కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతుంటామన్నారు. ఒకవేళ అనుకూలంగా లేకుంటే పార్టీలో ఉండలేమని సోనియా గాంధీకి రాసిన లేఖలో తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఎంపీలందరూ కలిసే ఉన్నారని, వారు వెనక్కు తగ్గలేదని, ఎంపీల మధ్య పట్ల ఎలాంటి విభేదాలు లేవన్నారు.
తమ వెనుక కెవిపి రామచంద్రరావు ఉన్నారనేది పిచ్చి వ్యాఖ్యలని కొట్టిపారేశారు. రాజీనామాల విషయంలో మధుయాష్కీ విభేదించినా తెలంగాణాకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాజీనామాలపై చేసిన వ్యాఖ్యలు యాష్కీ వ్యక్తిగతమన్నారు. తెలంగాణా పట్ల అధిష్టానం సానుకూలంగా ఉందని, ఈ విషయంలో ఎఐసిసి అధికార ప్రతినిధి చాకో చేసిన ప్రకటన సంతృప్తినిచ్చిందన్నారు. రాజయ్య మాట్లాడుతూ ఏడుగురు ఎంపీలం రాజీనామాలు చేశామని, లేఖలను సోనియా గాంధీ కార్యాలయంలో అందజేశామని తెలిపారు. రాజీనామాలు ఆమోదం పొందేవరకు కాంగ్రెస్లోనే ఉంటామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ ఫార్మెట్లోనే రాజీనామాలు సమర్పించామన్నారు. వేరే పార్టీలో చేరేందుకు రాజీనామాలు చేయలేదని వివరణ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు రాజీనామాలు చేసినట్లు తెలిపారు. సృష్టమైన ప్రకటన వచ్చే వరకు కేంద్రం, అధిష్టానంపై ఒత్తిడి పెంచుతూనే ఉంటామన్నారు. రాజీనామాలు ఆమోదించకుంటే బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేస్తామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more