Differences in non-BJP camp family quarrel: Margaret Alva దేశంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తోంది : మార్గ‌రెట్ అల్వా

Not a token fight many things can happen opposition s vice presidential candidate margaret alva

margaret alva, opposition candidate margaret alva, margaret alva union minister, margaret alva latest news, margaret alva vice presidential poll, vice presidential poll, margaret alva latest update, margaret alva slams bjp, vice presidential candidate, opposition parties, NDA candidate, Jagdeep Dhankar, Parliament, National Politics

Opposition candidate for Vice President election Margaret Alva said the upcoming V-P poll is not a token fight and many things could happen, adding that this is a time for change. The parliamentarian said, "I don't think it is a token fight and many things could happen. I am fighting on behalf of 20 parties. We are making a statement that things are not well in Parliament and we do believe that this is a time for change."

దేశంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తోంది : మార్గ‌రెట్ అల్వా

Posted: 08/03/2022 06:28 PM IST
Not a token fight many things can happen opposition s vice presidential candidate margaret alva

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధుల మ‌ధ్య పోటీ లాంఛ‌న‌ప్రాయ పోరు కాద‌ని ఎన్నో అంశాలు చోటుచేసుకోవ‌చ్చ‌ని విప‌క్షాల ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి మార్గ‌రెట్ అల్వా అన్నారు. ఎన్‌డీఏ అభ్య‌ర్ధి జగ్ధీప్ ధ‌న్‌క‌ర్‌కు సంఖ్యాబ‌లం అనుకూలంగా ఉన్నందున పోటీ లాంఛ‌నప్రాయ‌మేన‌న్న అభిప్రాయాన్ని ఆమె తోసిపుచ్చారు. తాను 20 పార్టీల త‌ర‌పున పోరాడుతున్నాన‌ని, పార్లమెంట్‌లో ప‌రిస్ధితులు బాగా లేవ‌ని తాము మాట్లాడుతున్న క్ర‌మంలో మార్పుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావిస్తున్నామ‌ని మార్గ‌రెట్ అల్వా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం దేశంలో అన‌ధికార ఎమర్జెన్సీ న‌డుస్తోంద‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఉపరాష్ట్రపతి అనగానే రాజ్యసభను నడిపించే బాధ్యత అతనిపై ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాజ్యసభ వర్షాకాల సమావేశాలను చూస్తూంటే అందోళన కలుగుతోందని అన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలపై, ధరాఘాతంపై విపక్షాలు చర్చలకు పట్టుబడితే.. అధికారంలోని ప్రభుత్వం మాత్రం క్రీడలకు సంబంధించిన అంశాలను చర్చించాలని రాజ్యసభ ముందుంచిందని అన్నారు. దేశప్రజల ప్రాధాన్యత క్రమంలో ఏది రాజ్యసభలో చర్చించాలి.. క్రీడలకు సంబంధించిన అంశాలనా..లేక ధరాఘాతానికి సంబంధించిన అంశాలనా.. అని అమె ప్రశ్నించారు. రాజ్యసభ చైర్మన్ ప్రధమ కర్తవ్యం ప్రభుత్వాన్ని, విపక్షాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం చేసేలా చర్చలకు అనుమతించడమేనన్నారు.

ఇక ప్రస్తుతం పార్లమెంటులో గత కొన్నేళ్లుగా వాడిన పదాలను ఇకపై వాడరాదని ఆంక్షలు విధిస్తూ కూడా కోడ్ ను తీసుకువచ్చారని అమె ఎద్దేవా చేశారు. మాట్లాడే అవకాశమే లేనప్పుడు పార్లమెంటుకు సభ్యులు ఎందుకు రావడం అని అమె ప్రశ్నించారు. అసులు పార్లమెంటు సమావేశాలు ఎందుకు జరపాలని కూడా ఆమె నిలదీశారు. తాను ఇందిరాగాంధీ హయాం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నానని అయితే అప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవని అమె అన్నారు. గత 30 ఏళ్ల కాలంలో పార్లమెంటులో అనేక అంశాలను చర్చకు తీసుకువచ్చానని, అయితే ప్రభుత్వంతో అంశాల వారీగా వ్యతిరేకించవచ్చునని అన్నారు.

అయితే అది విపక్షాలను మాట్లాడకుండా చేయడం మాత్రం కాదని.. సభలోంచి విపక్షసభ్యలను బయటకు పంపేలా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని మార్గరేట్ అల్వా ప్రశ్నించారు. ఆగ‌స్ట్ 6న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌రగ‌నుండ‌గా అదే రోజు ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఎన్నిక‌ల ఫ‌లితం ప్ర‌క‌టిస్తారు. బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ్ధీప్ ధ‌న‌క‌ర్‌ను పాల‌క ఎన్‌డీఏ త‌మ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలిపింది. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జ‌గ్ధీప్ ధ‌న‌క‌ర్‌కు బీఎస్‌పీ చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగ్దీప్ ధ‌న్‌క‌ర్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించామ‌ని ఆమె ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles