Extreme rainfall in July in multiple Telangana districts ఆగస్టు 1 వరకు తేలికపాటి వానలు.. ఈనెల 30న ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Imd issues yellow alert for 3 days in parts of telangana heavy rains continue to pound

Rain in Hyderabad, Rain in Telangana, yellow alert, telanagana, meteorological department, cyclonic, bay of bengal, upper air cyclonic circulation, Peddapalli, Jayashankar Bhupalpally, Mulugu, Bhadradri Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Mahabubabad, Medak, Warangal rural districts, heavy flood flow, musarambhag bridge close, hyderabad floods, musi floods

The Met Department, issued yellow alert for heavy rains at several places over the next three days. Officials said light to moderate rain or thundershowers were likely at many places across the State. IMD notes that the upper air cyclonic circulation over the west-central Bay of Bengal off Andhra Pradesh coast extends upto 3.1 km above mean sea level which results in rains for the next three days.

ఆగస్టు 1 వరకు తేలికపాటి వానలు.. ఈనెల 30న ఆ జిల్లాల్లో భారీ వర్షాలు: ఐఎండీ

Posted: 07/29/2022 11:52 AM IST
Imd issues yellow alert for 3 days in parts of telangana heavy rains continue to pound

తెలంగాణ రాష్ట్రంపై వరుణుడు తన ప్రకోపాన్ని చాటాడు. వరదలంటే ఎరుగుని హైదరాబాద్ ప్రజలకు వరదల తీవ్రత ఎలాంటిదో చాటాడు. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించేలా చేశాడు. నగరం ప్రజలకు వందల ఏళ్లుగా దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలను పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా, ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో.. రెండు రిజర్వాయర్ల గేట్లను తెరచి నీటిని దిగువకు వదిలారు. దీంతో మూసీ నదిలోకి నీరు వెళ్లింది. ఈ కారణంగా మూసీ పరివాహక ప్రాంతాల​ను వరద ముంచెత్తింది.

జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నుంచి భారీగా నీరు దిగువకు విడుదల చేయడంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలసంద్రంగా మారాయి. ఉస్మాన్‌ సాగర్‌ 13 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని.. హిమాయత్‌సాగర్ 8 గేట్లు ఎత్తి 7,708 క్యూసెక్కుల నీటిని.. అధికారులు దిగువకు విడుదల చేశారు. మూసీకి అటువైపున ఉన్న ప్రాంతాలను ఇటువైపు ఉన్న ప్రాంతాలను కలిపేందుకు పలు చోట్ల వంతెనలు ఉన్నాయి. అయితే ముసారాంబాగ్ వంతెన మాత్రం వరద నీటిలో చిక్కకోవడం.. వంతెనపై నుంచి నీరు వెళ్లడంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచుసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలుగా దానిని మూసివేసిన ఘటన కూడా వరుణుడి ప్రభావం కారణంగానే చోటుచేసుకుంది.  

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఓ శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతానికి భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని తెలిపింది. ఆగస్టు ఒకటి వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల తీవ్రత తగ్గిందని, ఇప్పటికే 94 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని పేర్కొన్నది. కాగా, శనివారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.

రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది. ఇదిలాఉండగా గురువారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని చంచూర్ లో అతిభారీ వర్షం కురిసింది. ఇక్కడ అత్యధికంగా 10.25 సెంటీమీటర్ల వర్షం కురివగా, ఆ తరువాత నిర్మల్ జిల్లాలోని పెంబిలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ 5.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తరువాత కామారెడ్డి జిల్లాలోని మచ్చాపూర్, లింగంపేటలలో భారీ వర్షం కురిసింది. ఈ ప్రాంతాలలో వరుసగా 4.9, 4.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తరువాత హైదరాబాద్ నగరంలోని బంజారాహీల్స్ ప్రాంతంలో ఏకంగా 4.10 వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles