పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా మూడవరోజు కూడా విపక్షాల నిరసనలతో దద్దరిల్లాయి. గంధరగోళ పరిస్థితుల మధ్య పార్లమెంటు ఉభయసభలు గురువారానికి వాయిదా వేయబడ్డాయి. జీఎస్టీ పెంపు, రూపాయి క్షీణత, ధరల పెరుగుదల అంశాలపై విపక్షాలు సభలో నిరసనలు తెలిపాయి. గబ్బర్ సింగ్ స్ట్రైక్స్ అగేన్ అంటూ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రైతులపై కక్షగట్టిన ప్రభుత్వం.. వ్యవసాయోత్పత్తులైన పెరుగు, పాలు, పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీని విధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సహా యూపీఏ పక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో లోక్సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.
ధరల పెరుగుదల, రోజువారీ వస్తువులపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తుండటం వల్ల లోక్ సభలో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఉదయం భేటీ అయిన నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడగా.. ఆ తర్వాత సమావేశమైనప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కార్యకలాపాలు సజావుగా జరిగే పరిస్థితి లేకపోవడం వల్ల.. సభను గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 11 గంటలకు తిరిగి ప్రారంభమైన సభలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడింది. ఆ తరువాత గురువారానికి వాయిదా పడింది.
సభను వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నిర్వహించేది చర్చల కోసమే కానీ, నినాదాల కోసం కాదని హితవు పలికారు. 'ప్రజలు సభల నుంచి చర్చలు ఆశిస్తున్నారన్నారు. సభ్యులు గొడవ చేస్తూ సభ పరువు తీస్తున్నారు. రచ్చ చేస్తున్న సభ్యుల తీరు పార్లమెంటరీ సంప్రదాయాలకు భంగం కలిగిస్తోంది. అంశాల వారీ చర్చల కోసం నిబంధనల ప్రకారం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. జీరో అవర్లో ఏదైనా అంశాన్ని లేవనెత్తడానికి అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. సభలో ఆందోళన చేయడానికి, అలజడి సృష్టించడాన్ని అనుమతించను. సభ్యులు సీటులోకి వెళ్తే మాట్లాడే అవకాశం ఇస్తా' అని స్పీకర్ పేర్కొన్నారు.
అయితే, సభ్యులు తమ ఆందోళనపై వెనక్కి తగ్గలేదు. దీంతో సభ వాయిదా వేయక తప్పలేదు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఎగువ సభ ఉదయం సమావేశం కాగానే విపక్ష సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను వెంటనే నియంత్రించాలని, రూపాయి మారకం విలువను తగ్గకుండా చర్యలుచేపట్టాలని, ధరాఘాత ప్రభావం నుంచి దేశప్రజలను రక్షించాలని నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైనా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ధరల మోతపై విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఎగువసభ గురువారానికి వాయిదా పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more