డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై పగబట్టిందా.? అన్నట్లుగా నిత్యావసర సరుకులు మొదలుకుని.. అన్ని సరుకులు ధరలు పెరుగుతున్నాయి. కరోనా ముందు పరిస్థితులు వేరు.. కరోనా తరువాత పరిస్థితులు మరింతగా దిగజారాయి. కరోనా పేరుతో ఆర్థిక పరిస్థితులంటూ కేంద్రం అన్నింటి ధరలను పెంచుకుంటూపోవడంతో మధ్యతరగతి ప్రజల స్థితిగతులు మరింతగా దిగజార్చాయి. అధికారంలోకి వచ్చేముందు నిత్యావసర సరుకుల ధరలను 100 రోజుల్లో నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వానికి కనీసం ఆ మాట గుర్తుందా.? అని కూడా ప్రశ్నలు మద్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
ఓ వైపు ఇంధనం, మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్న కేంద్రం.. మధ్యతరగతికి లభించే ఆదాయాలపై శ్రద్ద చూపడం లేదన్న వాదనలు వినబడుతున్నాయి. ఇప్పటికే వంటింటి గ్యాస్ సిలిండర్ పై ఇచ్చే సబ్సీడీని కరోనా నుంచి నిలిపేసిన కేంద్రం.. ఇక ఆ తరువాత ఇటీవల కాలం నుంచి వంటింటి గ్యాస్ సిలిండర్ పై పలుమార్లు వడ్డింపులు వేస్తూనే ఉంది. అన్నింటిలోనూ 2014తో పోల్చుకునే మోడీ సర్కార్.. 2014లో వంటింటి గ్యాస్ సిలిండర్ ధర ఎంత.? సబ్సీడీ ఎంతమేర ఇచ్చేవారన్నది విషయాన్ని మాత్రం ఎందుకు మర్చిపోతున్నారు? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఇక తాజాగా వంటింటి సబ్సీడి గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం మళ్లీ వడ్డించి.. మధ్యతరగతివాసుల నడ్డి విరిచింది. ఇన్నాళ్లు గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది. అయితే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం మళ్లీ తగ్గించింది. తాజాగా సిలిండర్పై రూ.8.50 కోతవిధించింది.
ఈనెల 1న వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.198 తగ్గించిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వచ్చేశాయ్.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ లిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు. గృహావసరాల కోసం వినియోగించే 14 కేజీల సిలిండర్పై కేంద్రం రూ.50 వడ్డించింది. దీంతో హైదరాబాద్లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది.
#AchheDin Aa Gaye
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more