ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఈ విషయంపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా.. ఢిల్లీలో 'ఆర్' వాల్యూ.. 2 దాటినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో ఆర్ వాల్యూ 2.1కు చేరిందని ఐఐటీ మద్రాస్కు చెందిన నిపుణులు వెల్లడించారు. అంటే.. ప్రతి రోగి.. మరో ఇద్దరికి వైరస్ను వ్యాపింపజేస్తున్నట్టు అర్థమని పేర్కొన్నారు. దేశంలో కొవిడ్ నాలుగో వేవ్పై భయాలు నెలకొన్న వేళ.. ఢిల్లీ ఆర్ వాల్యూపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా ఆర్ వాల్యూతో.. వైరస్ను ఓ వ్యక్తి ఎంతమందికి వ్యాపింపజేస్తున్నడో లెక్కగట్టవచ్చు. ఆర్ వాల్యూ 1 కన్నా తక్కువకు పడిపోతే.. మహమ్మారి దశ ముగిసినట్టు పరిగణిస్తారు. ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయ్, ప్రొఫెసర్ ఎస్ సుదంర్ నేతృత్వంలోని ఐఐటీ మద్రాసు డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమెటిక్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కంప్యూటేషనల్ మేథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ విభాగం.. కంప్యూటైజేషన్ మోడలింగ్ ద్వారా ఈ ఆర్ వాల్యూను లెక్కగట్టారు. ఢిల్లీలో ఆర్ వాల్యు 2.1కు చేరగా.. ఇండియా మొత్తం మీద ఆర్ వాల్యూ 1.3గా ఉందని నిపుణులు వెల్లడించారు.
ఢిల్లీ ఆర్ వాల్యూ పెరగడం.. నాలుగో వేవ్కు సంకేతమా? అన్న ప్రశ్నపై నిపుణులు స్పందించారు. ఈ విషయంపై ఇప్పడే ఏదీ చెప్పలేమని అభిప్రాయపడ్డారు. నాలుగో వేవ్పై మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఇమ్యూనిటీ పరిస్థితులపై ఇంకా అవగాహన లేదని, మూడో వేవ్లో వైరస్ బారినపడ్డ వారికి మళ్లీ కొవిడ్ సోకుతోందా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలని వివరించారు. ముంబై, చెన్నై, కోల్కతాలో కేసులు తక్కువే ఉన్నాయని, నాలుగో వేవ్ ట్రెండ్ను ఇప్పుడే పసిగట్టలేమని నిపుణులు అంటున్నారు.
ఢిల్లీలో పాజిటివీ రేటు 4.64శాతంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 1,042 కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగం ఢిల్లీలోనే ఉండటం గమనార్హం. కాగా, ఢిల్లీలో తాజా పరిస్థితులకు కొత్త వేరియంట్ కారణమని వైద్యులు భావిస్తున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2.12.1ను రోగుల్లో గుర్తించినట్టు పేర్కొన్నారు. అయితే.. ఇది కొత్త వేరియంటేనా? కాదా? అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని వివరించారు. ఇక మరోవైపు ఒమిక్రాన్ బిఏ 1, బిఏ 2 వేరియంట్లు ఇప్పటికే బయటపడ్డాయి. అయితే చైనాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ ఎక్స్ఈ కూడా గుజరాత్ లో వెలుగుచూసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more