నషాముక్త్ హైదరాబాద్ గా నగరాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్న పోలీసులు అదివారం అర్థిరాత్రి బంజారాహిల్స్ ర్యాడిసన్ హోటల్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎంఐఎం పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోంటున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో మాదకద్రవ్యాలు తీసుకున్న వారిని ప్రాథమికంగా గుర్తించారు. పబ్ లోని సీసిటీవీ ఫూటేజీతో పాటు నిర్వాహకుల నుంచి విచారణలో రాబట్టిన సమాచారంతో మొత్తంగా ఆదివారం రోజు రాత్రి ఫుడ్డింగ్ అండ్ మింట్ ఫబ్ లో ఏకంగా 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. కీలకమైన ఆధారాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్ లో పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించారు. మాదకద్రవ్యాలు తీసుకున్న 20 మంది వీఐపీలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పబ్ మేనేజర్ అనిల్ తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ గోవా ముంబై కి చెందిన కొంతమంది వ్యక్తుల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిలో గతంలో డ్రగ్స్ తో పట్టుబడిన పెడ్లర్స్ కూడా ఉన్నారు. గోవా, ముంబై లో నుంచి అనిల్.. డ్రగ్స్ తేప్పినట్టుగా ఇచ్చినట్టుగా పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి.
మరోవైపు ఈ కేసులో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు అభిషేక్, అనిల్ కుమార్ల వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్ల ద్వారా కీలక విషయాలు రాబడుతున్నారు పోలీసులు. ప్రత్యేక కోడ్ లతో ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరింత సమాచారం కోసం రిమాండ్ ఖైదీలుగా ఉన్న అభిషేక్, అనిల్ కుమార్లను వారం రోజులు కస్టడీకి అప్పగించాలంటూ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును అభ్యర్థించారు. కాగా ఈ పిటీషన్ పై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరగాల్సివుండగా, న్యాయస్థానం దానిని ఈ నెల 11కు వాయిదా వేసింది.
టాస్క్ఫోర్స్ పోలీసులు పుడ్ అండ్ మింక్ పబ్లోకి వెళ్లిన అనంతరం నిందితుల్లో ఒకరు తనను రక్షించాలంటూ పలువురు పోలీసులకు ఫోన్లు చెసినట్లు సమాచారం. ఇక మాదకద్రవ్యాల కేసులో నిందితులుగా ఉన్న అర్జున్ వీరమాచినేని, కిరణ్రాజ్లపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వీరిద్దరూ దేశం విడిచి పారిపోయేందుకు అవకాశాలున్నాయన్న అనుమానంతో వారి పాస్పోర్టు వివరాలను అన్ని విమానాశ్రాయాలకు పంపించారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more