తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం సంభవించింది. బుధవారం వేకువ జామున.. మరికొద్ది గంటల వ్యవధిలో తెల్లవారుతుందనగా, సికింద్రాబాద్ బోయగూడలో భారీ అగ్నిప్రమాదంలో వలసకార్మికులు బతుకులు అనంతవాయువుల్లో కలసిపోయాయి. చుట్టూ దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న మంటలు, మాంసం ముద్దలుగా 11 మంది బీహార్ కు చెందిన కార్మికుల మృతదేహాలు తమను కాపాడే అభయహస్తాల కోసం వేచిచూస్తూ చెల్లాచెదురుగా పడివున్నాయి. అసలేం జరిగిందో కూడా పరిసర ప్రాంతాలవారీకి తెలియని అయోమయ పరిస్థితి. ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపకదళాలు మంటలను అదుపు చేసేందుకు గంటల సమయం శ్రమించాల్సి వచ్చింది.
అగ్నిప్రమాద సమయంలో టింబర్ డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపోతోపాటు స్క్రాప్ గోదాం కూడా ఉంది. టింబర్ డిపో నుంచి స్క్రాప్ గోదాంకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. కనీసం ఎవరి మృతదేహాలు ఎవరివో చెప్పలేని విధంగా కాలిపోయారు. దీంతో మృతులను గుర్తించేందుకు గాంధీ వైద్యులకు డీఎన్ ఏ పరీక్షలు చేయకతప్పని పరిస్థితి నెలకొంది. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో గోదాం లోపల ఉన్న కార్మికులు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు.
అయితే గోదాంలో ఒక్కటే ప్రవేశం ఉండటంతో వారు తప్పించుకునే వీలుకాకపోవడంతో ఆ మంటలలోనే కాలిపోయారు. సంఘటన చోటు చేసుకున్న సమయంలో కార్మికులంతా నిద్రపోతున్నారని సమాచారం. మంటల దాటికి నిద్ర లేచినప్పటికీ తప్పించుకునే మార్గం లేక అగ్నికి ఆహుతయ్యారు. ఓ వైపు మంటలు ఎగిసి పడుతుండగా మరోవైపు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసినట్లుగా అక్కడక్కడ పడి ఉన్న మృతదేహాలను బట్టి తెలిసింది. అయితే కిటికీ నుండి బయటకు దూకిన ప్రేమ్ అనే కార్మికుడు ప్రాణాలతో బయట పడ్డాడు. స్క్రాప్ గోదాంను అనుసరించి ఉన్న వెల్డింగ్ షాప్, కేబులో గోదాంలకు మంటలు వ్యాప్తి చెందాయి.
ఈ సంఘటనలో కేబుల్ గోదాంలో ఉన్న కేబుల్స్ కు మంటలు అంటుకుని పూర్తిగా దహనమైంది. మొత్తం మీద ఇక్కడి పరిస్థితి సినిమాలోని దృశ్యాలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తుండగా సిలిండర్ పేలుడు కూడా జరిగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని అక్కడున్నవారు వ్యక్తం చేశారు. మృతులలో 9 మంది మృతదేహాలు గుర్తుపట్టని విధంగా మాడిపోయాయి. దీంతో అన్ని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు చేయక తప్పని పరిస్థితి నెలకొందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద సంఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more