సినీనటుడు మంచు మోహన్ బాబు, మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణులపై ఇప్పటికే నాయిబ్రాహ్మణ సంఘాలు రెండు రోజుల వ్యవధిలో బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మంచువిష్ణు వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుపై వారు అనుచితంగా వ్యవహరించారని, అందుకు సంబంధించిన ఫూటేజీ వారి సిసిటీవీల్లోనే లభ్యం అవుతుందని కూడా అరోపిస్తున్న నేపథ్యంలో నిజానిజాలు ఏంటో తెలియాల్సి వుంది. అయితే మంచు విష్ణు మేనేజర్ సంజయ్ నాగశ్రీనుపై జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వారికి సంబంధించిన ఓ వ్యవహారం తాజాగా వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది.
మోహన్బాబు, మంచు విష్ణు నిరుపేదలా? అంటే ఔను అనే అంటున్నారు నెటిజనులు. మంచు విష్ణు, మోహన్ బాబు నటించిన చిత్రాలు వరుసగా ప్రేక్షకాదరణ పోందడం లేదని.. వీటిలో వారు సొంత బ్యానర్ లో రూపోందించిన చిత్రాలు కూడా వున్నాయని దాంతో చిత్రాలు కనీస అంచనాలు కూడా అందుకోకపోవడంతో వారు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. అంతమాత్రన వారు పేదోళ్లు ఎలా అవుతారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయినా.. వారు చిత్రాలతో పాటు పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. మనం చర్చించుకోవడం పక్కన బెడితే ఇప్పుడీ విషయమై సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఎందుకు అన్న వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్లోని సాగు భూమి లేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలు వారిపేరిట మంజూరు కావడమే ఈ చర్చకు కారణం. ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదైన ఈ వివరాలు వెలుగులోకి రావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎలోని 2.79 ఎకరాలను మోహన్బాబు పేరిట, 412-1బిలో 1.40 ఎకరాలను విష్ణు పేరిట దరఖాస్తు పట్టా జారీ చేశారు. 2015లోనే దరఖాస్తు పట్టాలు మంజూరు చేయగా ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమయ్యాయి. ఈ విషయమై స్పందించిన తహసీల్దారు శిరీష పూర్తి వివరాలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more