రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు ఇప్పటికే హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఒక్క జిల్లాలోనే పాజిటివిటీ రేటు 10 శాతం మించలేదని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జనం గుమికూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు విధించామన్నారు.
పాజిటివిటీ రేటు మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం ఉండగా, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం ఉందని వెల్లడించారు. ఇక జీహెచ్ఎంసీలో 4.26 శాతం, మేడ్చల్లో 4.22 శాతంగా ఉందన్నారు. ఐసీయూ, ఆక్సిజన్ పడల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని చెప్పారు. వారం రోజులుగా రోజుకు లక్షకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే జరుగుతొందని, మూడు రోజుల్లోనే 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామన్నారు. 15 నుంచి 18 ఏండ్లలోపువారిలో 59 శాతం మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించారు. ఇదిలావుండగా తెలంగాణలో కోవిడ్ ఆంక్షల అమలుపై తెలంగాణ హైకోర్టు పలు సూచనలు చేసింది.
కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటీషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ ప్రకారం, కోవిడ్ నిబంధనలు పాటించని వారి నుంచి జరిమానాలు వసూళ్ల చేయడం లేదని పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం.. మాస్క్లు ధరించని, సామాజిక దూరం పాటించకుండా ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని ఆయన రాష్ట్ర పోలీసులు, జిహెచ్ఎంసిని ఆదేశించారు. ఇక ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావును ఈ నెల 28 తమ ఎదుట హాజరు కావాలని ఆయన అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more