ఆదాయం పన్నుశాఖకు సారధ్యం వహిస్తున్న కేంద్ర ప్రత్యక్ష బోర్డుల మండలి (సీబీడీటీ)కి లీగల్ నోటీసు జారీ అయ్యాయి. శాఖ పోర్టల్ లోపభూయిస్టంగా వున్నా తమ వినతి మేరకు గడువును పెంచాలని కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఈ లీగల్ నోటీసులను అఖిల ఒడిశా టాక్స్ అడ్వకేట్ల సంఘం (ఏవోటీఏఏ) జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగించనందుకు ఒడిశా టాక్స్ అడ్వకేట్ల సంఘం ఈ నోటీసు జారీ చేసింది. ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పినా.. అందులో పలు సాంకేతిక లోపాలు తలెత్తాయని పేర్కోంది.
ఈ కారణంగా ఐటీఆర్ దాఖలు గడువు పొడిగించనందుకు ఆ చట్టంలోని 234 ఎఫ్ సెక్షన్ కింద ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిపింది. తాము జారీ చేసిన లీగల్ నోటీసు అందుకున్న తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించకుంటే ఒడిశా హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని కూడా ఐవోటీఏఏ స్పష్టం చేసింది. ఐటీఆర్ గడువు పెంపునకు ఐటీశాఖను ఆదేశించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఈ నెల నాలుగో తేదీన జారీ చేసిన లీగల్ నోటీసులో వెల్లడించింది.
పాత ఇన్కం టాక్స్ పోర్టల్లో సమస్యలు ఉన్నప్పటికీ యూజర్ ఫ్రెండ్లీగా ఉందని ఐవోటీఏఏ వ్యాఖ్యానించింది. కానీ 2021-22 ప్రారంభమైన తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఇన్ఫోసిస్కు కొత్త పోర్టల్ రూపకల్పన కాంట్రాక్ట్ అప్పగించింది. కానీ నూతన పోర్టల్లో సమస్యల కారణంగా చాలా మంది ఐటీఆర్ దాఖలు చేయలేకపోయారని ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీఆర్ వివరాలు నమోదు చేస్తున్న సమయంలో సిస్టం హ్యాంగవుతూ వచ్చిందని పేర్కొంది. డిసెంబర్ నెలాఖరులోగా ఐటీఆర్ దాఖలు చేయడానికి పలు కష్టాలు పడ్డామని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more