ఫిలిప్పీన్స్లో ‘రాయ్’ తుఫాను భీకర విధ్వంసం సృష్టించింది. సముద్రం కల్లోలంగా మారి ఫిలిఫ్పిన్స్ తీరాన్ని తాకడంతో.. బీభత్సం తాండవించింది. రాయ్ తుఫాను ధాటికి ఆ దేశంలో ఏకంగా 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. దేశంలో తుఫాను ధాటికి ఇటీవల కాలంలో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారని అదేశ అధికారిక వర్గాలు తెలిపాయి. తుఫాను ధాటికి ఏకంగా 52 మంది అదృశ్యంకాగా, 239 మంది క్షతగాత్రులయ్యారని ఫిలిఫ్పిన్స్ పోలీసు అధికారులు వెల్లడించారు. రాయ్ తుపాను తీరం తాకిన ఆర్చిపెలాగోలోని దక్షిణ, సెంట్రల్ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది.
గురువారం రోజున ఒక్క ఉదుటున తమ దేశంపై పడిన రాయ్ తుఫాను ధాటికి సముద్రపు ఒడ్డును ఆనుకుని వున్న బీచ్ లలోని రిసార్టులు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయని అవేదన వ్యక్తం చేశారు. ఈ భయానక తుఫాను ధాటికి ఏకంగా 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. కోస్తా ప్రాంతాల్లో పూర్తిగా కొట్టుకుపోయి.. కేవలం శిధిలాలు మాత్రమే మిగిలాయని అన్నారు, తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల ధాటికి అనేక ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. తీర ప్రాంతం మొత్తం తుడుచుపెట్టుకుపోయిందని ఫిలిప్పీన్స్ రెడ్క్రాస్ తెలిపింది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. తీర ప్రాంతంలోని ఇళ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలన్నీ కుప్పుకూలిపోయి.. శిధిలాలుగా మారాయని రెడ్క్రాస్ ఛైర్మన్ రిచర్డ్ గోర్డాన్ తెలిపారు. సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాయ్ తుఫాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more