లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కమిటీని వేసి వారి ఆధ్వర్యంలో కేసును దర్యాప్తును చేపట్టాలని అదేశించిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో కేంద్రమంత్రి తనయుడు.. తన కారుతో రైతులను తొక్కించుకుంటూ ముందుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, సహా పలు రాష్ట్రాల్లో బీజేపి ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లలేని పరిస్థితులు అలుముకున్నాయి. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశీశ్ మిశ్రా సహా ఆయన సన్నిహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టిన విషయం తెలిసిందే..
కాగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని.. కేంద్రమంత్రికే రైతులంటే గౌరవం లేనప్పుడు.. ఆయనకు కేంద్రం ఎందుకు మంత్రి పదవిని కల్పించిందన్న డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలు పర్యాయాలు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక పోలీసుల దర్యాప్తు తీరు ఎన్ని పర్యయాలు చెప్పినా మారడం లేదని.. ఈ కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తిని నియమించి దర్యాప్తు మొత్తం ఆయన పర్యవేక్షణలోనే జరగాలని అదేశాలు జారీ చేసింది. దీంతో ఎట్టకేలకు ఈ కేసులో కీలక మలుపు తిరిగింది.
అయితే, ఇన్నాళ్లు యాధృశ్చికంగా జరిగిన ఘటనగా పేర్కోన్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు బిన్నంగా.. తాజాగా ఇది ఒక ప్రణాళికబద్దమైన కుట్ర అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం వెల్లడించింది. అంతేగాక, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశీశ్ మిశ్రాపై ఇప్పటికే నమోదైన అభియోగాలను మార్చాలని కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి సిట్ లేఖ రాసింది. కాగా, లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్రమంత్రి కొడుకు అశీశ్ మిశ్రాపైన, అతని సహనిందితుపైన ఇప్పటికే హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటితోపాటు హత్యాయత్నం, ఇతర అభియోగాలను కూడా చేర్చనున్నట్లు సిట్ పేర్కొన్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more