అందంగా అద్దాల మేడలుగా కనిపించే భవంతులలోనూ అన్యాయం, అక్రమాలు కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయని నానుడి మరోమారు నిజమని తేలింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో కళ్లు ధగదగలాడే బిల్లులతో పాటు గుండె కూడా గుబేలుమనేలా భారీ చోరీ జరిగింది. ఓ వివాహమహోత్సవాన్ని నిర్వహించేందుకు హోటల్ లో దిగిన ఓ ప్రముఖడి గది నుంచి రెండు కోట్ల విలువైన ఆభరణాలు, 95వేల నగదును దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జైపూర్ సమీపంలోని హోటల్ క్లార్క్స్ అమెర్లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గత వారం తన కూతురు వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు జైపూర్ లోని హోటల్ క్లార్స్స్ అమెర్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నాడు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ భాటియా. ఈ క్రమంలో హోటల్ కు ఈ బుధవారం చేరుకున్న వారు గురువారం తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా ఆ హోటల్లో నిర్వహించారు. అయితే పెళ్లికి వచ్చినవారంతా హోటల్లోని లాంజ్ ఏరియాలో అసీనులై అక్కడే ఉన్న వధూవరులను ఆశీర్వదించి.. లాంచ్ పక్కన ఏఱ్పాటు చేసిన బోజన అతిథ్యాన్ని కూడా స్వీకరించి వెళ్లారు.
అయితే రాహుల్ ాటియా కుటుంబంతో పాటు బంధువర్గమంతా పెళ్లి వేడుకల్లో బిజీగా ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తులు.. భాటియా బస చేసిన రూమ్ లోకి వెళ్లి భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో భాటియా గదిలో ఉన్న రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 95వేల నగదును ఎత్తుకెళ్లారు. శుక్రవారం తమ గదిలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన రాహుల్ భాటియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ సిబ్బంది ఈ చోరీకి పాల్పడినట్లు భాటియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీనిపై హోటల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more