రోజురోజుకూ తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మధ్య నవంబర్ నెలలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకే రాష్ట్రంలో చలి అలుముకుంటోంది. దీంతో రాజధాని హైదరాబాద్ నగరంలోనూ రాత్రి తొమ్మిది గంటల తరువాత ట్రాఫిక్ పెద్దగా రోడ్లపై కనిపించడం లేదు. నవంబర్ నెలాఖరు వచ్చే సరికి రాష్ట్రంలో పరిస్థితులు మరింత మారుతాయని, చలి తీవ్రత మరింత పెరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కూడా విరివిగా కురిసన నేపథ్యంలో చలి తీవ్రత కూడా అధికంగానే వుంటుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, రానున్న మూడురోజుల్లో కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్లలో రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాలలో 13 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాకపోవడం కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణంగా చెప్పుకోచ్చారు. దీంతో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెదారిలో 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్లో కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్, అత్యధికంగా షాపూర్ నగర్లో 32.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కాగా, గత రెండేళ్ల కిందట అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతగా 6.6 డిగ్రీల సెల్సియన్ ను నమోదు చేసుకున్న బిహెచ్ఈఎల్ ప్రాంతంలోనూ ఈ సారి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు వున్నాయి. ఇక గచ్చిబౌలి ప్రాంతంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం విధులకు వెళ్లేందుకు ఉద్యోగులు కార్లనే వాడేందుకు ఇష్టపడుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఉదయం వేళల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more