అస్థిరంగా కదులుతున్న చంద్రుడితో భూమిపై ఉన్న తీర నగరాలకు ముంపు ముప్పు తప్పదని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తాజా అధ్యయనంలో వెల్లడైంది. పర్యావరణ మార్పులతోపాటు చంద్రుడి ఈ అస్థిర చలనం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని నాసా పరిశోధకులు వెల్లడించారు. 2030వ దశకం మధ్యలో అమెరికాలోని తీరప్రాంత నగరాలు ముంపుకు గురవుతాయని వాళ్లు స్పష్టం చేశారు. ఇప్పటికే అధిక ఆటుపోట్ల కారణంగా కొన్ని నగరాలు వరదల్లో చిక్కుకున్నాయని తెలిపారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) 2019లోనే ఇలాంటి 600 వరదలను రిపోర్ట్ చేసిన విషయాన్ని నాసా గుర్తు చేస్తోంది.
ఈ అధ్యయనం తాలూకు ఫలితాలను నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ప్రచురించారు. వరదల వెనుక ఉన్న ఖగోళ కారణాలను విశ్లేషించడంపైనే ఈ అధ్యయనం ప్రధానంగా దృష్టి సారించింది. దీని గురించి నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వివరించారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, సముద్ర మట్టాలు పెరగడం, పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచంలోని తీర ప్రాంతాల్లో వరదల ముప్పును పెంచుతున్నాయి. దీనికి సంబంధించి నాసా సీ లెవల్ చేంజ్ టీమ్ కీలకమైన సమాచారాన్ని అందిస్తోంది. ఈ సమాచారంతో మనం వరదల కారణంగా పర్యావరణం, ప్రజల జీవనోపాధులు ప్రభావితం కాకుండా తగిన చర్యలు తీసుకోగలం అని నెల్సన్ చెప్పారు.
చంద్రుడు వణకడం కొత్త విషయం ఏమీ కాదని కూడా నాసా స్పష్టం చేసింది. 1728లోనే తొలిసారి ఇది కనిపించింది. దీనివల్ల చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిపై చూపే ప్రభావం, పర్యావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోతుండటంతో కలిసి ఎలాంటి ప్రభావం చూపబోతుందన్నదే ఇక్కడ ముఖ్యమైన అంశం. చంద్రుడి కక్ష్యలో ఈ అస్థిర చలనం పూర్తి కావడానికి 18.6 ఏళ్లు పడుతుంది. ఇందులో తొలి భాగంలో భూమిపై ఆటుపోట్లు తక్కువగా ఉండి, రెండో భాగంలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ లెక్కన 2030వ దశకంలో మధ్యలో ఆటుపోట్లు పెరిగి ఇప్పటికే సముద్ర మట్టాలు పెరగడం వల్ల అతలాకుతలం అవుతున్న తీర నగరాలను పూర్తిగా ముంచేసే ప్రమాదం ఉన్నదని నాసా పరిశోధకులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more