కరోనా మహమ్మారి ముప్పు పోయిందన్న యోచనలో యావత్ ప్రపంచం వుందని అయితే అది ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, దక్షిణాఫ్రికా, భారత్ సహా అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు తెరపైకి వస్తున్నాయని, అయితే ఇది అత్యంత తీవ్రమైన వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ సూచించారు. నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్ తో ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంలోనూ.. తీవ్రతలోనూ అత్యంత ప్రమాదకారి అని అమె తెలిపారు. కరోనా మహమ్మారి సోకిన వ్యక్తి నుంచి ముగ్గురి మాత్రమే పరిమితం అయిన తొలిదశ, రెండవ దశ వేరియంట్లుకు భిన్నంగా డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి సగటున 8 మందికి ఈ వైరస్ వ్యాపిస్తోందని అమె తెలిపారు. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల కేసులు నమోదు కాగా, 9,300 మంది మరణించారని ఆమె చెప్పారు. కరోనా ఇంకా నెమ్మదించలేదనడానికి ఇదే సంకేతమన్నారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘డెల్టా కరోనా’ చాలా ప్రమాదకారి అని, దాంతోనే ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. మామూలు కరోనా సోకిన వ్యక్తి నుంచి మహా అయితే ముగ్గురికి వైరస్ అంటుతుందని, కానీ, డెల్టా సోకిన వ్యక్తి నుంచి 8 మందికి వ్యాపిస్తోందని ఆమె హెచ్చరించారు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఇటు ప్రజలూ కొంచెం సేద తీరేందుకు టూర్లకు వెళ్తున్నారని, కనీసం కరోనా నిబంధనలను పట్టించుకోవడం లేదని అన్నారు. గుమికూడుతూ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు కేసులు పెరగడానికి ఇదీ ఒక కారణమేనన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more