PM Modi emotional as he bids farewll to Azad గులాంనబి ఆజాద్ కు వీడ్కోలు.. భావోద్వేగానికి గురైన ప్రధాని..

Pm modi breaks down as he bids farewell to true friend azad

PM Modi, Ghulam Nabi Azad, PM In Rajya Sabha, PM Modi emotional, PM Modi bids farewll to Azad, Jammu and Kashmir, Nazir Ahmed Laway, Mohammad Fayaz, Shamsher Singh Manhas, National Politics

Prime Minister Narendra Modi choked up and struggled to speak in parliament today during a farewell to a rival politician, Rajya Sabha Leader of Opposition Ghulam Nabi Azad. PM Modi heaped praise on the Congress veteran who sat across him in the Rajya Sabha, and teared up as he shared an episode when they were both Chief Ministers - of Gujarat and Jammu and Kashmir.

గులాంనబి ఆజాద్ కు వీడ్కోలు.. భావోద్వేగానికి గురైన ప్రధాని..

Posted: 02/09/2021 01:17 PM IST
Pm modi breaks down as he bids farewell to true friend azad

రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సభలో ప్రసంగిస్తూ కొద్ది సేపు తన కన్నీళ్లుతో పోరాడాల్సి వచ్చింది. వాటిని బయటకు రానీయకుండా అపిన ఆయన.. ఈ క్రమంలో మంచినీళ్లు తాగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. గత రెండు నెలలకు పైగా చలిని కూడా తట్టుకుని అన్నదాతలు అందోళన చేస్తున్న నేపథ్యంలోనో.. లేక కరోనా మహమ్మారితో దేశంలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు పడిన కష్టాలు గుర్తుకువచ్చో కాదు.. ఆయన భావోద్వేగానికి గురయ్యారని అనుకుంటున్నారా.?

పుల్వామా దాడిలో ఏకంగా 40 మందికి పైగా జవాన్లు వీరమరణం పోందిన దాదాపుగా రెండేళ్లు కావస్తున్న తరుణంలో ఆ విషాదం గుర్తుకువచ్చి ఆయన కళ్ల చమర్చారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే అవన్నీ కాదు కానీ.. తన సహచరుడు, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు గులాంనబి అజాద్ పదవీ కాలాన్ని ముగించుకుని సభకు వీడ్కోలు చెబుతున్న సందర్భంలో.. ఆయనకు సభ ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ.. భావోద్వేగానికి గురయ్యారు. గులామ్ నబీ ఆజాద్ గురించి మాట్లాడినంత సేపూ, మోదీ భావోద్వేగంతోనే ప్రసంగాన్ని సాగించారు.

గులామ్ నబీ సేవలను కొనియాడిన ఆయన, భావితరాలకు ఆయన స్ఫూర్తిమంతుడని అన్నారు. ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర ఎంపీలకు, రాబోయే రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహం లేదని అన్నారు. ముఖ్యంగా కశ్మీర్ లో ఓసారి ఉగ్రదాడి జరిగిన వేళ, గుజరాత్ వాసులు అక్కడ చిక్కుకుని పోయారని గుర్తు చేసుకున్న మోదీ, ఆ సమయంలో ఆజాద్ తో పాటు ప్రణబ్ ముఖర్జీ గుజరాతీలను కాపాడేందుకు ఎంత శ్రమించారో తనకు తెలుసునని ఉద్వేగంగా మాట్లాడారు. తన సొంత కుటుంబ సభ్యులు చిక్కుకుంటే ఎంత శ్రమిస్తారో, ఆజాద్ అంత శ్రమించారని అన్నారు. ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తారన్న సంగతి తనకు తెలుసునని, కానీ ఆ వచ్చే వ్యక్తి ఆజాద్ ను మరిపించాలంటే చాలా కష్టమని అన్నారు.

"నాకు గులామ్ నబీ ఆజాద్ ఎన్నో ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నాం. అంతకుముందే ఎన్నో సార్లు కలసుకున్నాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఎంతో ముందుంటారు. ప్రకృతితో మమేకం అవుతుంటారు. ఉద్యానవనాల విషయంలో ఆయనకు చాలా తెలుసు. పదవులు వస్తుంటాయి. అధికారం దక్కుతుంది. కానీ వాటిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని ఎవరైనా ఆజాద్ ను చూసి తెలుసుకోవచ్చు" అని మోదీ వ్యాఖ్యానించారు. ఇక మోదీ మాట్లాడుతున్నంత సేపూ పలుమార్లు గులామ్ నబీ ఆజాద్ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ కనిపించారు.

అంతకుముందు షంశేర్ సింగ్ మన్హాస్ గురించి మాట్లాడిన మోదీ, "నా ప్రసంగాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను ఆయనతో ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. మా పార్టీని బలోపేతం చేసేందుకు ఆయనతో కలసి స్కూటర్ పై ప్రయాణించిన రోజులు నాకింకా గుర్తున్నాయి. రాజ్యసభలో ఆయన హాజరు అద్భుతం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు నేను ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాను" అని చెప్పారు. వారితో పాటు నజీర్ అహ్మద్ లావే, మొహమ్మద్ ఫయాజ్ తదితరుల సేవలనూ కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles