తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసులు వెలుగుచూసిన తొలినాళ్లలోనే విదేశాలకు వెళ్లి కర్ణాటకలోని తన కార్యాలయానికి వెళ్లి అటు నుంచి సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ కు వచ్చిన బాధితుడి ద్వారా రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే.
ఇక అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన కేసులు మే నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినా ఎలాంటి సడలింపులు లేకుండా ముందుకెళ్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మే 3వ తేదీ వరకు అంతా సవ్యంగానే సాగింది. తెలంగాణలోనూ సడలింపులు ఇవ్వడంతో.. కరోనా మరోమారు పంజావిసురుతోంది. మే 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రెండు రోజుల క్రితం నగరంలో నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 79కి చేరుకోవడం అందోళనను రేకెత్తించింది.
ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులు తెలంగాణలో నమోదైన గరిష్ట కేసుల సంఖ్యగా తేలడం మరో అందోళకన విషయం. ఈ మొత్తం కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 1312 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జీహెఛ్ఎంసీ పరిధిలోని జియాగూడలోనే నమోదయ్యాయి, ఇక ఇక్కడే కరోనాతో చికిత్స పోందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.
స్థానిక ఇందిరానగర్ పరిధిలోని ఓ ప్లాస్టిక్ వ్యాపారి (68), మరో యువతి(36) ఇద్దరు మరణించారు. ఇక ఇక్కడి సంజయ్ నగర్లో ఉంటున్న ఒకరికి పాజిటివ్ కేసు నమోదైంది. వీరితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 32 అని తెలంగాణ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే ఒక్కసారిగా ఇంతలా కేసులు పెరగడానికి కారణం ఏంటన్న విషయమై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more