Delhi court refuses to stay execution of convicts సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘నిర్భయ’ దోషి పవన్ గుప్తా

Nirbhaya case supreme court rejects nirbhaya case convict pawan gupta s curative petition

Nirbhaya convicts, Execution, Pawan Gupta, Curative petition, Supreme court, Patiyala Court, Death Sentence, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts Curative petition, Satish Kumar Arora, Supreme Court, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, gang-rape, Tihar jail, Crime

The Supreme Court on Monday dismissed the curative petition filed by Pawan Gupta, one of the four death row convicts in the 2012 Nirbhaya gangrape and murder case.

‘నిర్భయ’ కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా

Posted: 03/02/2020 03:16 PM IST
Nirbhaya case supreme court rejects nirbhaya case convict pawan gupta s curative petition

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా వేసిన క్యురేటివ్‌ పిటిషన్ ను ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో తనకు పడిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ పవన్‌ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై ఇవాళ ఛాంబర్లో విచారణ జరిపిన ధర్మాసనం.. దోషి అభ్యర్థనను కొట్టివేసింది.

దోషి పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ లో ఎలాంటి కొత్త అంశాలు లేవని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో దోషికున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశం ఇదే. దీంతో నలుగురు దోషులు న్యాయపరమైన హక్కులను వినియోగించుకోగా, ఇక పవన్ కుమార్ గుప్తా మాత్రం ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. దీంతో అతను ఇవాళ క్షమాబిక్షను పెట్టుకుంటాడా.? లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. క్షమాబిక్ష పెట్టుకున్న పక్షంలో ఢిల్లీలోని పటియాల కోర్టు విధించిన డెత్ వారెంట్ మరోమారు వాయిదా పడుతుంది.

అదే జరిగితే జనవరి 22, ఫిబ్రవరి 1, తరవాలో మార్చి 3వ తేదీ న మరోమారు దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా పడుతొంది. ఇదిలావుండగా, మంగళవారం ఉరిశిక్ష విధించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా చివరి నిమిషంలో దోషులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఉరితీతపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది.

ఆ తర్వాత దోషులకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇటీవల దిల్లీ కోర్టు మూడోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశించింది. ఉరి అమలు దగ్గరపడుతున్న సమయంలో దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా మరోసారి కోర్టుకు వెళ్లాడు. తన శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గించాలని కోరుతూ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే అతడి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles