ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కర్నూలు జిల్లాలో అరుదైన నేత నుంచి స్వాగతాన్ని అందుకున్నారు. తమ పార్టీకి చెందిన నేతలు ఆయన వస్తున్న సమాచారం అందుకుని విమానాశ్రాయాలకు చేరకుని ఘనస్వాగతాన్ని పలుకుతుండటం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా ఇవాళ ఆయన కర్నూలు పర్యటనలో ప్రముఖ బీజేపీ ఎంపీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయన మరెవరో కాదు. టీజీ వెంకటేష్. కర్నూలు జిల్లాలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు వచ్చిన జగన్కు టీజీ స్వాగతం పలికారు.
అంతటితో ఆగని బీజేపి ఎంపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను శాలువాతో సత్కారించారు. బీజేపీ ఎంపీ అయినా సీఎం జగన్ను కలిసి సన్మానించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకు కారణాలు ఏంటీ.?.. ఒకనాటి రాష్ట్ర రాజధానిగా బాసిల్లిన తమ జిల్లాకు.. మరోమారు అంతటి ఘనకీర్తిని అందించడమేనని టీజీ చెబుతున్నారు. కర్నూలు జిల్లాను న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు జగన్ను టీజీ వెంకటేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సన్మానం తర్వాత ఇద్దరి మధ్య ఎయిర్పోర్టులో ఆసక్తికర సంభాషణ జరిగింది.
కర్నూలుకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందని జగన్ ను ఎంపీ టీజీ అడగ్గా.. కేంద్రం అనుమతి కోరామని.. నివేదిక కూడా పంపించామని సీఎం చెప్పారని సమాచారం. రాయలసీమ డిక్లరేషన్లో, బీజేపీ మేనిఫెస్టోలో హైకోర్టు అంశం ఉందని.. కాబట్టి హైకోర్టుకు సంబంధించి కేంద్రం నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన రావొచ్చని ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారట. ముఖ్యమంత్రి జగన్ పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడు రామ్మోహన్రెడ్డి పెళ్లి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓర్వకల్లు విమానశ్రయంలో జగన్కు ఎంపీ టీజీతో పాటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more