ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ఈ బిల్లుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. శాసనమండలి రద్దు నిర్ణయం సవ్యమైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వీర్గీయ నందమూరి తారక రామారావు రద్దు చేసిన శాసన మండలిని పునరుద్దరించేందుకు మాజీ సీఎం చెన్నారెడ్డి 1990లో కృష్టి చేసినా అది సాధపడలేదని.. అయితే దానిని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి ఫలితంగా పునరుద్దీపబడిందని అన్నారు.
అప్పట్లో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వుండటంతో.. అటు లోక్ సభతో పాటు ఇటు రాజ్యసభలోనూ తన మిత్రపక్షాలతో కలసి బిల్లును అమోదింపజేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. దానిని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అందించిందని అన్నారు. అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పునరుద్ధరించిన మండలిని రద్దు చేయడం సహేతుకరమైన చర్య కాదని అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ముందుచూపుతోనే రెండు సభలు ఏర్పాటు చేశారని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇలాంటి వ్యవస్థలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శాసనసభ బిల్లులను ఏ ప్రభావంతో అమోదించినా.. శాసనమండలిలోని సభ్యులు ప్రతీ బిల్లుపై లోతుగా అధ్యయనాలు చేస్తారని.. మేధావులు, రాజకీయ పండితులు, వివిధ రంగాలలో నిష్ణాతులు ఈ సభకు ప్రాతినిథ్యం వహిస్తారని.. వారు బిల్లులను అమోదించే క్రమంలో అన్ని రకాలుగా అలోచించి పలు సవరణలు కూడా చేసేలా చర్యలు తీసుకుంటారని పవన్ అన్నారు. రద్దుకు ప్రజాభిప్రాయం తీసుకున్నట్టు లేదని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇక ఇటు ట్విట్టర్ ద్వారా కూడా ఇవాళ సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. 'న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?' అని ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఆయన తీరు సరికాదని హితవు పలికింది. 'హడావుడిగా రాజధాని తరలింపు చేయడం తప్పు అని కోర్టు తెలిపింది. తెలుగు మాధ్యమం లేకుండా చేయడం సరికాదని చెప్పింది. ఉద్యమంలా చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసుకునే కార్యక్రమాన్ని తప్పుబట్టింది. నియంత ధోరణిలో నువ్వు తీసుకుంటోన్న నిర్ణయాలను తప్పుబడుతోందని న్యాయస్థానాన్ని కూడా రద్దు చేస్తావా జగన్ రెడ్డి?' అంటూ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more