అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. మూడు రాజధానుల ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇవాళ తన పదవికి రాజీనామా సమర్పించారు. రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతో తాను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కోన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. రాష్ట్ర విభజనతో అమరావతి రాజధాని కావాలని తాను అసెంబ్లీలోనూ, బయటా ప్రయత్నాలు చేశానని గుర్తు చేసుకన్నారు.
పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనను నిత్యం అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ..తనపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞుడనని పేర్కోన్నారు. , వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకష్ తన పట్ల చూపిన అభిమానానికి ధన్యవాదాలని చెప్పిన ఆయన మరో షాకింగ్ విషయాన్ని కూడా పేర్కోన్నారు. ఇటీవల 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరును చూసిన తాను భవిష్యత్తులో ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నానని తెలిపారు. అయినా తనను అభిమానించి, ఆదరించిన ప్రతిపాడు ప్రజలకు తాను నిత్యం రుణపడి వుంటానని అన్నారు.
ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడం వెనుక అధికార వైసీపీ పార్టీ వ్యూహలు వున్నట్లు పలువురు టీడీపీ శ్రేణులు అరోపిస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయకుండా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ నిన్న అర్థరాత్రి అసెంబ్లీలో బిల్లు అమోదం పోందింది. దీంతో పారిపాలన వికేంద్రీకరణకు కూడా తెరలేపుతున్నట్లు ప్రభుత్వం పేర్కోంది. అయితే మాణిక్యవరప్రసాద్ మాత్రం క్రితం రోజునే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.
తొలిరోజు మండలి సమావేశానికి హాజరైన డొక్కా రెండో రోజు హాజరుకాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. గత ఎన్నికల్లో పత్తిపాడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా డొక్కా పోటీ చేశారు. అయితే.. డొక్కా సమావేశాలకు గైర్హాజరు కావడంపై టీడీపీలో చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా సమావేశాలకు హాజరుకాలేదు. అయితే.. తాను అనారోగ్యం కారణంగానే హాజరుకాలేదని ఆమె తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా సభలో లేకపోవడం కొసమెరుపు.
అయితే శాసనమండలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డొక్కాను ఆప్యాయంగా పలకరించారు. డొక్కా కూడా నవ్వుతూ జగన్ను కుశలమడిగారు. దీంతో.. డొక్కా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం మొదలైంది. ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ప్రస్తావించారు. దీంతో డొక్కా రాజీనామా వెనుక అధికార పార్టీ వుందన్న వాదనలకు బలం చేకూరుతోంది. శాసనమండలిలో టీడీపీతో పోల్చుకుంటే వైసీపీకి సంఖ్యా బలం తక్కువ. దీంతో.. వ్యూహం ప్రకారం వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తున్నట్లు సమాచారం. కొందరు టీడీపీ ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపి తమ వైపు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ వ్యూహం రచించినట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more