వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తెలుగు చిత్రరంగంలో అనేక వివాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన రేంజ్ నుంచి ఆయన గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతున్న సమయంలో ఆయన రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని చిత్రాలను రూపొందించారు. తన సినిమాలకు మీడియాతో ప్రచారం ఎలా కల్పించుకోవాలో ఆర్జీవికి తెలుసునని కూడా పలువురు వ్యాఖ్యానించారంటే ఆయన రేంజ్ ఇట్టే అర్థమైపోతుంది. ఆయనకే కాదు ఆయన పేరుకు కూడా ఆ రేంజ్ వుందని కంట్రీ క్లబ్ న్యూఇయర్ రోజున నిరూపించింది.
తమ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆర్జీవిని తీసుకువస్తామని చెప్పడంతో.. ఆర్జీవిని చూడాలని.. ఆశతో కొందరు యువత కంట్రీ క్లబ్ ఈవెంట్ కు హాజరయ్యారు. కానీ వాస్తవానికి అక్కడికి ఆర్జీవి రాలేదు. అసలు న్యూఇయర్ అంటే తనకు మా పెద్దగా ప్రత్యేకతేమీ లేదని, ఇది ప్రతీరోజు మాదిరిగానే వుంటుందని ఆర్జీవి చెప్పిన మాటలను ఒంటపట్టించుకోని యువత ఆయన కోసం వేచిచూశారు. వారిలో ఒకరు టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తనయుడు కాంత్రి కుమార్. ఇచ్చిన మాటను తప్పారంటూ ఈవెంట్ నిర్వాహకులతో క్రాంతి కుమార్ ఘర్షణకు దిగారు. దీంతో ఆయన కారును అడ్డుకున్న నిర్వాహకులు, తాళాలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.
దీంతో తన కారు కనిపించడం లేదంటూ కంట్రీక్లబ్ వద్ద విధుల్లో ఉన్న ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డికి క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇందుకు అంగీకరించని క్రాంతికుమార్ ఎస్సైతో వాదులాటకు దిగడంతో ఆయనను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలిసిన నట్టి కుమార్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తం 13 మందితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
తన కుమారుడ్ని పోలీసులు అదుపులోకి ఎందుకు తీసుకున్నారంటూ వాదులాటకు దిగారు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న సిబ్బందిని నట్టి కుమార్ కుటుంబ సభ్యులు చేత్తో నెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు..విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై హైదరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అంతేగా మరి ఎవరి అనువుగాని చోట అధికులం అన్నరాదన్నది ఇప్పటికైనా కాంత్రికుమార్ కు బోధపడిందోలేదో మరి. ఇక ఆర్జీవి పేరుకున్న కాంట్రావర్సీ పవర్ ఇదని కూడా పలు రూమర్లు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more