సార్వత్రిక ఎన్నికలలో పూల్వామా ఘటన గురించి వ్యాఖ్యలు చేయవద్దని ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రధాని నరేంద్రమోడీ సహా బీజేపి నేతలు ప్రచారాస్త్రాంగా విరివిగా వినియోగిస్తున్న బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ అంశంపై ఇప్పటికే విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాము లేవనెత్తిన ప్రతీ అంశంలో ప్రధాని మోడీకి, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు ఈసీ క్లిన్ చిట్ ఇవ్వడంపై విపక్ష నేతలు ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈసీ సహా సుప్రిం కూడా తాము జోక్యం చేసుకోలేమన్న తేల్చిచెప్పడంతో రెట్టించిన ఉత్సాహంతో బాలకోట్ దాడుల అంశాన్ని మరింతగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని భావించారు ప్రధాని. బాలకోట్ దాడు వ్యూహరచనలో తన పాత్ర గురించి గొప్పగా చెప్పకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని అవగాహనారాహిత్యంలో పలు వ్యాఖ్యలు చేశరంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అంతేకాదు నెట్ జనుల చేతిలో ఆయన ట్రాల్ అవుతున్నారు. బాలాకోట్ దాడుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టాయి.
అసలాయన చేసిన వ్యాఖ్యలు ఏమిటీ అంటే.. మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాకిస్థాన్ పై దాడి చేసిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను విపక్షాలతో పాటు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి రాడార్ల పనితీరును మేఘాలు ప్రభావితం చేయలేవు. మేఘాలు దట్టంగా అలుముకున్న సమయంలో కూడా వాతావరణంలో రాడార్లు పనిచేస్తాయి. అయితే మోడీ మాత్రం ఇందుకు విరుద్ధంగా చెప్పడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మేఘాలు దట్టంగా ఉన్నా, అవతల ఏముందో పసిగట్టేందుకే రాడార్ టెక్నాలజీ రేడియో తరంగాలను వాడతారని, ఆరోజు బాలాకోట్ ఏరియాలో మేఘాల వల్ల ఐఏఎఫ్కి ఎలాంటి అదనపు ఉపయోగం లేదని పలువురు రాడార్ నిపుణులు చెబుతున్నారు.
Jumla hi fekta raha paanch saal ki sarkar mein,
— Congress (@INCIndia) May 12, 2019
Socha tha cloudy hai mausam,
Nahi aaunga radar mein. pic.twitter.com/xDeOg4Yq5K
‘‘జుమ్లా(మోసపూరిత మాటలు) చెప్పడం మోడీకి అలవాటే. గడిచిన ఐదేండ్లుగా ఆయన చేస్తున్నది అదే. మేఘాలు అడ్డున్నా, రాడార్లకు చిక్కకుండా మోసం చేస్తూనే ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ విమర్శించింది.
National security is not something to be trifled with. Such an irresponsible statement from Modi is highly damaging. Somebody like this can’t remain India’s PM. https://t.co/wK992b1kuJ
— Sitaram Yechury (@SitaramYechury) May 11, 2019
‘‘నేషనల్ సెక్యూరిటీ ఎంత కీలకమైందో తెలిసి కూడా దాని విలువను తగ్గించేలా మోడీ మాట్లాడారు. బాధ్యతారాహిత్య కామెంట్లతో దేశభద్రతకు డ్యామేజ్ చేశారు. ఇందుకాయన సిగ్గుపడాలి. ఇలా మాట్లాడే వ్యక్తి ప్రధానిగా ఉండటానికి అనర్హుడు’’ అంటూ సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pakistani radar doesn’t penetrate clouds. This is an important piece of tactical information that will be critical when planning future air strikes. https://t.co/OBHwEJfGSW
— Omar Abdullah (@OmarAbdullah) May 11, 2019
‘‘మేఘాలు అడ్డుంటే పాకిస్థాన్ రాడార్లు పనిచేయవన్న సీక్రెట్ మోడీ మాటలతో బయటపడింది. భవిష్యత్తులో దాడులకు పనికొచ్చే అంశమిది. అన్నట్టు, బీజేపీ ట్వీట్లు ఏమైనట్లు? మేఘాల్లో కలిసిపోయాయా?’’ అంటూ ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు.
No secret that Balakot strikes failed to hit the intended target. Was it because PM overruled the advice of IAF & authorised airstrikes in bad weather? Cloud cover logic is painfully embarrassing.Remind me again, why is RG derided as Pappu? #cloudonradargone pic.twitter.com/yfZOiUMzFk
— Mehbooba Mufti (@MehboobaMufti) May 12, 2019
‘‘బాలాకోట్పై దాడుల్ని ప్రశ్నించినప్పుడు నాపై దెమ్మెత్తిపోశారు. ఇప్పుడు మోడీ చెప్పిన క్లౌడ్ థియరీ పాకిస్థాన్ విమర్శనాస్త్రంగా మారింది. మన భద్రతా బలగాలకు ఇంత అవమానం అవసరమా అన్నదే నా బాధ’’ అంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ విమర్శించారు. అంతటితో ఆగని అమె మరో అడుగు ముందుకేసి.. ఆర్జీకి ఏమీ తెలియదని అభివర్ణిస్తూ పప్పును అని అతన్ని అపహాస్యం చేయడంలో అర్థమేలేదని డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేశారు.
He's one step away from saying he was the pilot... https://t.co/sQhCnTwrWu
— Kunal Kamra (@kunalkamra88) May 11, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more