భారత్ పైకి దండెత్తిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టిన మిగ్ 21 యుద్ధ విమానాలపై ఆరోపణలు వస్తున్న వేళ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కీలక వివరణ ఇచ్చారు. ఆపరేషన్లో అత్యంత పాతవైన మిగ్-21 విమానాలను వినియోగించారనే ఆరోపణలను ఆయన ఖండించారు. మిగ్-21 యుద్ధ విమానాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. సుఖోయ్, మిరాజ్ 2000 లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలుండగా.. మిగ్-21 విమానాలను ఎందుకు వాడాల్సి వచ్చిందనే అంశంపైనా ఆయన వివరణ ఇచ్చారు.
పాక్కు చెందిన ఎఫ్-16 విమానాలను అడ్డుకోవడానికి మిగ్-21 బైసన్లు ఎదురుదాడికి దిగడాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా సమర్థించారు. అది ముందే ప్రణాళిక వేసుకొని చేసింది కాదని.. అత్యవసర సమయంలో ఏ యుద్ధ విమానం అందుబాటులో ఉంటే దాన్ని పంపుతామని వెల్లడించారు. ‘ముందే ప్లాన్ చేసుకున్న ఆపరేషన్ అయితే ఎంపిక చేసిన యుద్ధ విమానాలను పంపిస్తాం. బాలాకోట్లో జరిగిన దాడి ఇలాంటిదే. అదే అప్పటికప్పుడు జరిగే దాడిని తిప్పికొట్టడానికి అందుబాటులో ఉన్న ఏ ఫైటర్ జెట్ అయినా బయలుదేరుతుంది.
అన్ని ఫైటర్ జెట్స్.. శత్రువులతో పోరాడే సామర్థ్యం ఉన్నవేనని ధనోవా స్పష్టం చేశారు. భారత వైమానిక దళం పాకిస్థాన్లోని బాలాకోట్ దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఘటనకు ప్రతిగా.. దాయాది దేశం 24 యుద్ధ విమానాలతో ఇండియాపైకి వచ్చింది. ఈ విషయాన్ని రాడార్లు ముందే గుర్తించి సంకేతాలివ్వడంతో వాటిని అడ్డుకోవడానికి భారత వాయుసేన ప్రతిచర్య ప్రారంభించింది.
ఈ క్రమంలో వాయుసేనకు చెందిన రెండు మిగ్ 21 బైసన్ విమానాలు పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ వెళ్లాయి. శత్రుదేశ విమానాలను వెంటాడుతూ వెళ్లిన ఓ మిగ్ 21 విమానం ఎల్వోసీలో కూలిపోయింది. అందులో ఉన్న పైలట్ అభినందన్ అప్పటికే ప్యారాచూట్ ద్వారా కిందకి దిగారు. ఆయణ్ని పాక్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ను పాక్ ఆర్మీ భారత్కు అప్పగించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more