ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాఫెల్ డీల్ పై ఆయన మాట్లాడుతూ, ఈ డీల్ లో అనిల్ అంబానీకి మధ్యవర్తిగా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో మోదీ రాజీ పడ్డారని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన స్నేహితుడు అనిల్ అంబానీకి మేలు చేసేందుకు మోదీ యత్నించారనే విషయానికి సంబంధించి ప్రతి రోజు ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తోందని రాహుల్ అన్నారు. రూ. 30వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయిందని చెప్పారు. రాఫెల్ డీల్ గురించి రక్షణ మంత్రికి, రక్షణ శాఖకు కూడా తెలియదని... కేవలం మోదీకి, అనిల్ అంబానీకి మాత్రమే తెలుసని అన్నారు.
ఇది కేవలం అవినీతికి మాత్రమే సంబంధించిన అంశం కాదని... దేశ రహస్య చట్టానికి సంబంధించిన అంశం కూడా అని చెప్పారు. ఒక వ్యక్తి కోసం దేశ భద్రతనే పణంగా పెట్టారని విమర్శించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయని అన్నారు. ఈ అంశంలో అవినీతి, డీల్ జరిగిన తీరు, దేశ భద్రతలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ క్షమించరాదని చెప్పారు.
మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కూడా రాహుల్ హాజరై, సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, యాంటీ కరప్షన్ క్లాజ్ ను మోదీ తొలగించారంటూ ఓ పత్రికలో కథనం వచ్చిందని చెప్పారు. దేశానికి కాపలాదారుడైన వ్యక్తి దొంగగా మారారంటూ విమర్శించారు. ఇక క్రితం రోజున యూపీలో తన సోదరి ప్రియాంకగాంధీతో కలసి ర్యాలీ నిర్వహించిన రాహుల్.. అనంతరం జరిగిన సభలో ప్రధాని మోడీని అనుకరిస్తూ.. ఆయన హావభావాలు గత ఎన్నికలకు ప్రస్తుతానికి చాలా మార్పులు సంభవించాయని అవి ఎలానో ప్రదర్శించి.. అందరినీ ఆకట్టుకున్నాడు.
మోదీ చెయ్యి ఎలా తిప్పుతారు? ఆయన శరీర కదలికలు ఎలా వుంటాయో అనుకరిస్తూ చూపించారు. "గతంలో నరేంద్ర మోదీ ఇలా మాట్లాడేవారు... ఇలా... ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు" అంటూ మోదీ హావభావాలను అనుకరించే ప్రయత్నం చేశారు. "సోదర సోదరీమణులారా... అనిల్ అంబానీ ఎవరో నాకు తెలియదు. ఆయనకు నేను ఎన్నడూ 20 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు" అని ఆయన అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more