ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎన్నికల జిమ్మికులు అనేకం చేస్తారని అందులో భాగంగానే పెన్షన్ల రెట్టింపు జరిగిందని, డ్వాక్రా మహిళలకు పసుపు- కుంకుమ పేరుతో చెక్కుల పంఫిణీ జరిగిందని ఇప్పటికే విమర్శిస్తున్నారు విపక్ష పార్టీ వైసీసీ నేతలు. ఈ క్రమంలో మరో అడుగుముందుకేసిన ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి చెల్లని చెక్కులు ఇచ్చారని కూడా అరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతలు చేసిన అరోపణలే నిజమయ్యాయా.? అన్న అనుమానాలు ఇప్పుడు తలెత్తక మానవు.
ఔనా.? ఎందుకని అంటారా.? డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇచ్చిన రూ. 10 వేల 'పసుపు - కుంకుమ' చెక్కులను క్యాష్ చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన నెల్లూరు జిల్లా వింజమూరు మహిళల ఆనందం గంటల్లోనే ఆవిరైంది. బ్యాంకులోకి వెళ్లిన చెక్కులను డిపాజిట్ చేసుకున్న అధికారులు వాటికి బదులు నగదు ఇవ్వకుండా.. బకాయిల కింద జమ చేసుకుంటున్నామని చెప్పగానే.. డ్వాక్రా మహిళలు విస్మయానికి గురయ్యారు. బ్యాంకు ఎదుటే ధర్నాకు దిగారు.
ఈ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగింది. వింజమూరులోని ఎస్బిఐ బ్యాంకు అధికారులు చెక్కులను డిపాజిట్ చేసిన నగదు ఇచ్చే క్రమంలో పై అధికారుల వత్తిడి లేకపోయినా.. వారంతటవారే ఓ నిర్ణయానికి వచ్చి మెలిక పెట్టారు. ఈ ఘటన తాలుకు మరిన్ని వివరాల్లోకి వెళితే, ఒక్కో పొదుపు మహిళకూ రూ. 10 వేల చొప్పున ఏపీ సర్కారు చెక్కులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని బ్యాంకుల్లో వేసుకుని, నేరుగా డబ్బు తీసుకోవచ్చని కూడా మంత్రులు స్పష్టం చేశారు. దీంతో ఎంతో ఆశతో బ్యాంకుకెళ్లిన మహిళలు, అధికారులు చెప్పిన మాటతో అవాక్కైన పరిస్థితి.
మహిళలు రోడ్డుపై ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పేందుకు నానా తంటాలూ పడ్డారు. ఇక ఇదే విషయమై బ్యాంకు అధికారులను సంప్రదించగా, పలు పొదుపు సంఘాల గ్రూప్ లు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించలేదని, అందువల్లే కొంత మొత్తాన్నైనా జమ చేయాలని కోరామని అన్నారు. అయితే, ఈ విషయంలో అధికారుల నుంచి మాత్రం తమకు ఎటువంటి ఆదేశాలూ రాలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more