ప్రముఖ రచయిత్రి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీత మెమతాకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. సాహిత్యంలో ఆమె చేసిన సేవకు గాను పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డు ప్రకటనపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తనకు అందివ్వాలనుకుంటున్న ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్లో ఉంటున్న ఆమె దీనికి సంబంధించి ఓ ప్రెస్ స్టేట్మెంట్ను విడుదల చేశారు.
మోదీ సర్కార్ అవార్డు ప్రకటించిన సమయం సరైంది కాదని అందుకే పద్మశ్రీని తిరస్కరిస్తున్నానని ఆమె ఓ స్థానిక వెబ్ సైట్లో పేర్కొన్నారు. ‘నన్ను పద్మశ్రీ అవార్డుకు అర్హురాలుగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే... సాధారణ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇలా అవార్డుల్ని ప్రకటించడం సరైన సమయం కాదని నేను భావిస్తున్నానను, అందుకే కేంద్రం ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న పద్మశ్రీ అవార్డును తిరస్కరిస్తున్నాను.
ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించి ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేస్తుంది. నాకు ఈ విషయం చాలా ఇబ్బంది కలిగించింది. దీనికై నేను విచారం వ్యక్తం చేస్తున్నానని.. ’మెహతా ప్రకటనలో పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్రంలో హంగ్ ఏర్పడితే... మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈసారి ఒడిశా బీజేడీ ( బిజు జనతాదళ పార్టీ)తో జతకట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి గీత మెహతాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిందని రాజకీయవర్గాలు సమాచారం. బీజేడీ మద్దతు కోసమే మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా గీతమెహతాకు అవార్డు అందించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడామె పద్మశ్రీని తిరస్కరించడంతో నమో సర్కార్ సందిగ్ధంలో పడిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more