నిరుద్యోగ భారతమంటూ దశాబ్దాల క్రితం నుంచి వస్తున్న సమస్య రానురాను మరింత పెద్దదిగా మారింది. ఎంతలా అంటే నాలుగో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఉద్యోగాలకు ఏకంగా డిగ్రీ పట్టా పుచ్చుకున్నవారు దరఖాస్తు చేసుకున్నేంత. అంతేకాదు కేవలం 13 పోస్టుల కోసం ధరఖాస్తులు అహ్వానిస్తే ఏకంగా ఏ వేల మంది నిరుద్యోగులు పోటీ పడ్డారంటే సమస్య తీవ్రత ఎంతలావుందో మరోసారి స్పష్టమైంది.
కష్టపడి పీజీలు, డిగ్రీలు చేసినా జాబ్స్ దొరకడంలేదు. దీంతో నిరుద్యోగులు ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా వెయిటర్ పోస్ట్ కు కూడా భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. మహరాష్ట్ర సెక్రటేరియట్ మంత్రాలయంలోని క్యాంటీన్ లో ఇటీవల 13 వెయిటర్ పోస్ట్లకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దానికి 7 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పైగా వారిలో నూటికి తొంబై శాతం మంది గ్రాడ్యుయేట్లు అవడం గమనార్హం.
ఈ ఉద్యోగానికి నాలుగో తరగతి పాస్ అయిన వాళ్లు అర్హులు. ఉద్యోగం దొరక్క చేశారో ..లేదా సెక్రటేరియట్లో ఉద్యోగం అనుకుని చేశారో తెలియదు కాని.. ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాలుగో తరగతి పాస్ అయిన వాళ్లు అర్హులని నోటిఫికేషన్ లో తెలియజేశామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. వంద మార్కులతో కూడిన పరీక్షను నిర్వహించామని, తర్వాత సెలక్షన్ చేసిన 13 మందిలో 12 మంది గ్రాడ్యుయేషన్ చేయగా..ఒకరు మాత్రం ఇంటర్మీడియట్ చదివారని తెలిపారు. 25 నుంచి 27 ఏళ్ల వయసున్న 8 మంది అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలను సెలక్ట్ చేసినట్టు తెలిపారు.
దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ చేసిన వారు వెయిటర్ పోస్ట్కు దరఖాస్తు చేసుకున్నారంటే..దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమౌతోందని కామెంట్స్ చేస్తున్నారు. నాలుగో తరగతి అర్హతకు ఇంతమంది చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవడం బాధాకరమైన విషయమని.. గ్రాడ్యుయేషన్ చేసిన వారి చేతులతో టీ, బిస్కెట్లు అందిస్తే వాటిని మంత్రులు ఎలా తీసుకుంటారని కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more