వైఎస్ జగన్పై కత్తి దాడి కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు శ్రీనివాస్ను ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారం ఇవ్వాలని సెషన్స్ కోర్టులో నిందితుడి తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అతణ్ని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు ఆరోపించారు. పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు న్యాయవాది సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది.
జగన్పై దాడి కేసును ఇటీవలే ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే. శనివారం (జనవరి 12) ఉదయం విజయవాడలోని జిల్లా కేంద్ర కారాగారం నుంచి నిందితుడు శ్రీనివాస్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని విశాఖ విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. అతణ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయంపై తమకేమీ సమాచారం ఇవ్వలేదని నిందితుడి తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. శ్రీనివాస్ తరఫున ముగ్గురు లాయర్లు వాదిస్తున్నారు.
మరోవైపు.. వైఎస్ జగన్పై జరిగిన కత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జగన్పై దాడి కేసును ఎన్ఐఏ విచారణ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలున్నాయని లేఖలో పేర్కొన్నారు.
జగన్పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం సరికాదనీ, ఎన్ఐఏ విచారణను రీకాల్ చెయ్యాలని మోదీని చంద్రబాబు కోరారు. చంద్రబాబు లేఖపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. దాడితో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోతే ఎన్ఐఏ విచారణకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more