మినీ భారత పోరాటంలో ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడటంతో.. ఓటరు తీర్పు అన్ని రాష్ట్రాల్లో సుస్పష్టంగా వున్నా అత్యంత కీలకంగా మారిన మధ్యప్రదేశ్ లో మాత్రం ఓటరు తీర్పు ఎప్పటికప్పుడు కీలకంగా మారుతూ.. అన్ని పార్టీల అభ్యర్థులను ఉత్కంఠకు గురిచేసింది. మిగిలిన రాష్ట్రాల్లో ప్రీ-పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించినట్లు ఫలితాలు కూడా వస్తున్నాయి. అయితే అది నుంచి మధ్యప్రదేశ్ లో మాత్రం అటు సర్వే సంస్థలు, ఇటు ఓటరు తీర్పు కూడా ఉత్కంఠకు గురిచేస్తుంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నాలుగో పర్యాయం విజయాన్ని సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారుగా 75 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా.. ప్రభుత్వ వ్యతిరేకత వుందా..? లేదా.? అన్న విషయంలో మాత్రం ఓటరు తీర్పు స్పష్టంగా లేకపోవడంతో అటు పార్టీ అభ్యర్థులు కలవరానికి గురవుతున్నారు. ఈ రాష్ట్రంలో గెలుపోటములు ప్రధాన పార్టీలైన అధికార బీజేపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతుంది.
తొలుత కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో మధ్యప్రదేశ్ అధికార విపక్ష పార్టీల మధ్య పోటీ తీవ్రంగా వుండింది. అయితే ఒక దశలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవరించిందన్న వార్తలు రాగా, మరికొద్ది సేపట్లో ఆ వార్తలు తారుమారయ్యాయి. అధికార పార్టీని మించిన స్థానాలను కైవసం చేసుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఇక్కడ ఒక దశలో బీజేపి 115 స్థానాలను కైవసం చేసుకోగా, మరో మారు కాంగ్రెస్ ఆ సంఖ్యను అందుకుంది.
మొత్తంగా 230 స్థానాలు వున్న మధ్యప్రదేశ్ లో అధికారం అందుకునే కావాల్సిన మ్యాజిక్ ఫిగఱ్ 116 కాగా, అధికార బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ఆ ఫిగర్ అందుకోవడంలో పోటాపోటీని ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ ఏడు స్థానాలను కైవసం చేసుకున్న బీఎస్పీ పార్టీ ఎవరికి మద్దతును ప్రకటిస్తే వారే అధికారాన్ని హస్తగతం చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీ ఏదన్న అంశంలో పార్టీలు ఇతర పార్టీల అభ్యర్థులను, స్వతంత్రులను కలుపుకునేందుకు ఇప్పటి నుంచే బీజేపి నేతలు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇందుకోసం బీజేపి అధిష్టానం నుంచి ఇప్పటికే దూతలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more