అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఒక విశిష్టత వుంది. ఈ మాసంలోని సోమవారాల్లో భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో ఉపవాస దీక్షలు కూడా ఆచరిస్తారు. ఇక అదే సోమవారపు రోజుల్లో ఏకాదశి కూడా వస్తే.. ఇక ఆ రోజున భక్తులకు పరశించిపోతారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇవాళ కార్తీమ రెండో సోమవారంతో పాటు ఏకాదశి కూడా కలసిరావడంతో తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
రాజమండ్రీలో గోదావరి ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సామర్లకోట, పిఠాపురం తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వ్రత మండపాలు కిటకిటలాడాయి. తెలగు రాష్ట్రాలలోని అన్ని దేవాలయాల్లో ఓం నమ: శివాయ అన్న నామస్మరణలను మారుమ్రోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా శైవక్షేత్రాలన్నీ ముకంటి నామస్మరణతో మారుమోగాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.
శివాలయాల్లో మహిళా భక్తులు కొందరు కొందరు భక్తులు 365 ఒత్తుల దీపాలను వెలింగించగా, మరోకొందరు ఉసిరికాయ దీపాలను వెలిగించి కార్తీక దీపారాధన చేశారు. ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం, ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, ఉమామహేశ్వర వ్రతాలు నిర్వహించారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజశ్వేరస్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. వరంగల్ లోని వేయిస్తంభాల గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more