విశాఖపట్నం విమానాశ్రయంలో అనూహ్య ఘటన జరిగింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైస్సార్ కాంగ్రెస్) పార్టీ అధినేత జగన్ పై దాడి జరిగింది. ఈ వార్త దవానంలో వ్యాపించడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతుంది. విశాఖ ఎయిర్ పోర్టులోని వెయిటర్స్ లాంజ్ లో కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. అయితే దుండగుడు కత్తి జగన్ ఎడమ భుజం కింద దిగడం ఎలాంటి ప్రమాదం లేదు. ఈ ఘటనలో జగన్ భుజం నుంచి రక్తం వచ్చింది.
వెంటనే అలర్ట్ అయిన విమానాశ్రయ సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో దుండగుడు విమానాశ్రయంలోనే పనిచేసే వెయిటర్ అని తేలింది. అతడని శ్రీనివాసరావుగా గుర్తించిన దుండగుడిది అమలాపురం అని విచారణలో తెలుసుకున్నారు. జగన్ పై దాడి చేయడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న వ్యక్తిపై అగంతకుడు కత్తితో గాయపర్చడంతో ఇదేనా విపక్ష నేతలకు ఇచ్చే భద్రత.? అంటూ మరికోన్ని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
అయితే దాడికి ముందు వెయిటర్ శ్రీనివాస రావు విమానాశ్రయం లాంజ్ లో కూర్చున్న జగన్ వద్దకు వచ్చి.. ‘‘వైసీపీకి 160 సీట్లు వస్తాయా సార్?’’ అంటూ పలుకరించాడు... సెల్ఫీ దిగుతానంటూ దాడికి దిగాడు. జరిగిన ఘటనతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు జగన్ అక్కడే ప్రథమ చికిత్స చేయించుకుని, అనంతరం, విమానంలో హైదరాబాదుకు బయల్దేరారు. దాడి ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సివుంది.
(Video Source: NTV Telugu)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more