‘బ్యాంక్ రుణం అంటే అబ్బో అదో పెద్ద జంజాటం. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. సవాలక్ష ప్రశ్నలు, పదుల సంఖ్యలో ధ్రువపత్రాలు, రికమెండేషన్లు, ష్యూరిటీలు...తీరా వారు చెప్పినవన్నీ చేసినా కనికరిస్తారో లేదో చెప్పలేం’... ఇదీ సగటు ఖాతాదారుడి అభిప్రాయం. ‘అయితే మీకా అనుమానం అక్కర్లేదు, దరఖాస్తు చేసిన గంటలో అదీ మీరు బ్యాంక్ శాఖకు వెళ్లకుండానే రుణం పొందే అవకాశం కల్పిస్తాం’... అని భరోసా ఇస్తోంది ఆర్థిక శాఖ.
ఇందుకోసం ఇటీవల ప్రారంభించిన 'www.psbloansin59minutes.com' వెబ్ పోర్టల్లో మార్పులు చేస్తామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్కుమార్ వెల్లడించారు. సరైన ధ్రువపత్రాలు కలిగిన వారు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన ధ్రువపత్రాలు అప్లోడ్ చేస్తే చాలు. అంతా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు’ అని రాజీవ్కుమార్ తెలిపారు.
వ్యక్తులను కలవాల్సిన అవసరం ఉండదు, బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉండదు, ప్రక్రియ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల(ఎంఎస్ఎంఈ) నిర్వాహకులు రూ.కోటి వరకు రుణం పొందేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం ఈ పోర్టల్ను ప్రారంభించింది. సిడ్బీ వ్యూహాత్మక చొరవతో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ల కన్సార్టియం ఆధ్వర్యంలో ఇది ఏర్పాటైంది.
ఈ పోర్టల్ ద్వారానే వ్యక్తిగత, గృహ రుణాలు కూడా మంజూరు చేస్తామని ఆర్థిక శాఖ ప్రకటించింది. 20 నుంచి 25 రోజుల్లో మంజూరయ్యే రుణానికి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గంటలోపే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇందుకోసం బ్యాంకు అధికారులు ఖాతాదారుడి ఆదాయపన్ను రిటర్న్లు, జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్లను అనలిటిక్స్ ద్వారా వేగంగా విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. రుణం మంజూరైన వారం రోజుల లోపే చెల్లింపు కూడా పూర్తి చేస్తారు.
‘ఆరేడు నెలల్లో ఈ విధానం స్థిరత్వాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాం. అంతా ఆన్ లైన్లో పారదర్శకంగా ఉండడం వల్ల ఎగవేతలు తగ్గుతాయి. తెలిసీ తప్పుడు సమాచారం ఇస్తే కనుక బ్యాంకులు, పన్నులు వసూలు చేసే సంస్థలు పట్టుకుంటాయి, జాగ్రత్త' అని రాజీవ్ కుమార్ హెచ్చరించారు. కాగా ఈ విధానం అమలుతో ఇక బ్యాంకు రుణాలు పోందడం చాలా తేలిగ్గా మారిపోనుందని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more