దేవుడి సోంత రాష్ట్రంపై పగబట్టిన వరుణుడు.. ఏకధాటిగా గత పది రోజులుగా తన ప్రతాపాన్ని చాటుతూ ప్రళయాన్ని చూపుతున్న క్రమంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వరదలతో కాకవికళమైన కేరళలోని ముంపు ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించిన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రూ. 500కోట్ల తక్షన సహాయ నిధిని ప్రకటించారు. తక్షణ సాయం కింద రెండు వేల కోట్ల రూపాయలను అడిగిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వినతి మేరకు ప్రధాని ఎమర్జెన్సీ ఎయిడ్ కింద ఈ సహాయ నిధిని ప్రకటించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంతిమ సంస్కారాలు ముగిసిన అనంతరం ప్రధాని మోడీ నిన్న సాయంత్రమే కేరళలోని తిరువనంతపురం చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటనను వెల్లవరించారు. ప్రకటనకు ముందుగానే ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయాల్సివుంది. ఇందుకోసం ఆయన ఇవాళ ఉదయం కోచికి వెళ్లారు. వాస్తవానికి ఇవాళ ఉదయం కోచి నావెల్ బేస్ నుంచి బయల్దేరి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేపట్టాల్సి ఉంది.
అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం వెనక్కి వచ్చింది. న్నా వాతావరణం అనుకూలించక పోవడంతో వాయిదా పడింది. ఈ క్రమంలో ఆయన తొలుత ఈ మేరకు సహాయ నిధిని ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి, గవర్నర్ సి సదాశివమ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే అల్ఫోన్స్ తో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. అయితే పరిస్థితి తీవ్రంగా ఉన్న దృష్ట్యా తమకు రూ. 2000కోట్లు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసినప్పటికీ.. రూ. 500కోట్లే ఇస్తామని ప్రకటించారు. వరదల కారణంగా కేరళ ఇప్పటివరకు రూ.19వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.
అంతేగాక వరద బాధితులకు పీఎం జాతీయ సహాయ నిధి నుంచి నష్టపరిహారం కూడా మోదీ ప్రకటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ. 50,000 చొప్పున నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ప్రధాని మోదీ ఏరియల్ సర్వేను చేపట్టారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ జలదిగ్బంధంలో కూరుకుపోయింది. ఎటుచూసిన వరదనీరే కన్పిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వర్షాల సంబంధిత ఘటనల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. నేడు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
#WATCH: Prime Minister Narendra Modi conducts an aerial survey of flood affected areas. PM has announced an ex-gratia of Rs. 2 lakh per person to the next kin of the deceased and Rs.50,000 to those seriously injured, from PM’s National Relief Funds (PMNRF). #KeralaFloods pic.twitter.com/T6FYNVLmMu
— ANI (@ANI) August 18, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more