కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో వరుణుడు ప్రళయకార రుద్రుడై ప్రకోపాన్ని చూపుతున్న క్రమంలో మరో అందోళనకర వార్తను వెలువరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని తెలిపారు.
చత్తీస్గఢ్, విదర్భ ప్రాంతాల్లో తూర్పు ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతం అయిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే మత్య్సాకారులు వేటకు వెళ్లరాదని గతంలో ఇచ్చిన అదేశాలను మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా అంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతాల్లు ఇప్పటికే విస్తారంగా కురుస్తున్న వర్షాల ధాటికి పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించిన విషయం తెలిసిందే.
ఇక దీనికి తోడు మరో హెచ్చరిక కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఒడిశా తీరప్రాంతవాసులను కలవరానికి గురిచేస్తుంది. బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం ఉత్తర బంగాళఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే దీనికి వాతావరణం అనుకూలించి బలపడితే వాయుగుండంగా మారుతుందని.. అదే జరిగితే తెలుగు రాష్ట్రాలపై కూడా వరుణుడి ప్రతాపం అధికంగా వుండే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
శ్రీశైలం జలాశయానికి జలకళ..
ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుని పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.7 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో ఇవాళ ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ శ్రీశైలం జలాశయానికి చెందిన నాలుగు గేట్లు ఎత్తివేసి నీటినీ దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఈ నాలుగు గేట్ల ద్వారా దాదాపుగా లక్ష క్యూసెక్కుల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విడుదల చేయనున్నారు.
ఎగువనున్న జలాశయాలు జూరాల ప్రాజెక్టు నుంచి 1, 51,653 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి, 1,84,712 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. మొత్తం 3.36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనివాకు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 26వేల క్యూసెక్కలు నీరు విడుదలవవుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్ కు 74,767 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more