సుక్మా జిల్లా కుంట పోలీసు స్టేషన్ పరిధి కన్నాయి గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో మావోలకు చెందిన భారీ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. గొల్లపల్లి ప్రాంతంలో నక్సల్స్ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నక్సల్స్ కోసం ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని కుంట ఎస్పీ ప్రకటించారు.
కొద్ది రోజుల నుంచి పరిస్థితులు సాధారణంగానే కనిపించినా మళ్లీ తాజాగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కూంబింగ్ కు వెళ్లిన జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డగా.. వారిని లొంగిపోమ్మని.. జవాన్లు హెచ్చరించినా మావోయిస్టులు వారి మాటలను లక్ష్యపెట్టలేదని బధ్రతా దళాలు పేర్కోన్నాయి. అదే సమయంలో మావోలు తమపై కాల్పలు జరిపారని, దీంతో తాము కాల్పులతోనే బదులిచ్చామని.. అయితే ప్రాణ రక్షణకు తాము ఫైరింగ్ జరిపినట్లు బధ్రతా దళాలు పేర్కోన్నాయి.
ఎన్ కౌంటర్ ను ధ్రువీకరించిన స్థానిక పోలీసు అధికారులు, కొందరు జవాన్లకు కూడా గాయాలు అయ్యాయని, వారిని ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్యపై అధికారిక ప్రకటన తరువాత వెల్లడిస్తామని, ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. కాగా, ఎన్ కౌంటర్ తరువాత ఆ ప్రదేశానికి అదనపు బలగాలను తరలించిన ఉన్నతాధికారులు, అడవులను జల్లెడ పడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more