యోగా గురువు బాబా రామ్ దేవ్ ఇంతింతూ వటుడింతై అన్నట్లుగా వాణిజ్య రంగంలో దూసుకుపోతున్నారు. అయుర్వేద ఔషదాలను మాత్రమే విక్రయించే పతాంజలి సంస్థ.. అక్కడి నుంచి నేరుగా ఎఫ్ఎంజీసీ రంగంలోకి అడుగపెట్టారు. ఈ రంగంలోనూ తన ప్రత్యర్థులకు తాను వున్నానన్న ఉనికికి తన ఉత్పాదనల విక్రయాల ద్వారా తెలియజేసిన బాబా రాందేవ్.. ఇక తాజాగా మరో రంగంపై కూడా దృష్టిసారించారు. అదే టిలికాం రంగం.
ఇప్పటికే టెలికాం రంగంలోకి లేటుగా అడుగుపెట్టినా.. లేటెస్టుగా వచ్చాడన్నట్లు రిలయన్స్ జియో ఓ వైపు మిగతా కంపెనీల కస్టమర్లను అకర్షించడంలో విజయంవంతం అయ్యింది. ఏకంగా పదికోట్ల మంది కస్టమర్లను తమ ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్న తరుణంలో ఇక ఈ రంగంలో బాబా రాందేవ్ పతాంజలి సంస్థ కూడా అడుగుపెట్టడం ప్రత్యర్థి టెలికాం సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకుని స్వదేశీ-సమ్ రాధి సిమ్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
పతంజలి సిమ్ కార్డుతో రూ.144 రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 2GB డేటా ప్యాక్ తో పాటు.. 100 SMS ప్రీ. ప్రస్తుతానికి పతంజలి ఉద్యోగులు, అధికారులు మాత్రమే సిమ్ కార్డు ప్రయోజనాలు పొందనున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే.. ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడ మరో బంపరాఫర్ కూడా ఇచ్చారు. పతంజలి సిమ్ కార్డు వినియోగదారులకు.. పతంజలి ఉత్పత్తులపై 10శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించారు.
అంతే కాదండీ.. రూ.2.5 నుంచి రూ.5లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా అందిస్తున్నారు. యాక్సిడెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రజలకు అందిస్తామని తెలిపింది పతంజలి సంస్థ. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కు 5లక్షల కౌంటర్లు ఉన్నాయని.. వాటి నుంచి ప్రజలు త్వరలో పతంజలి స్వదేశీ-సంవృద్ది కార్డును పొందవచ్చని తెలిపారు యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more