Both Houses adjourned amid aiadmk mps protest లోక్ సభలో షరామామూలే.. రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం.. ఆ తర్వాత..

Both houses adjourned for wednesday amid protests by aiadmk mps

Lok Sabha, Government of India, Parliament of India, Mahajan, Motion of no confidence, Adjournment, Speaker of the Lok Sabha, Sumitra Mahajan, Cauvery river, Ananth Kumar, Congress, AIADMK, Speaker, Mallikarjun Kharge, congress, bjp, TDP, YCP, politics

Proceedings in Rajya Sabha and Lok Sabha were disrupted yet again on Tuesday as Parliament entered the last week of Budget Session.

లోక్ సభలో షరామామూలే.. రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం.. ఆ తర్వాత..

Posted: 04/03/2018 01:19 PM IST
Both houses adjourned for wednesday amid protests by aiadmk mps

పార్లమెంటులో జరుగుతున్న మలి విడత బడ్జెట్ సమావేశాలు చివరి వారానికి చేరుకున్నాక కూడా సభ్యుల అందోళనక్రమంలోనూ.. అటు అవిశ్వాసాలపై చర్చకు అనుకూల వాతావరణం సభలో లేదంటూ.. వాయిదాల పర్వం కొనసాగడంలో కానీ ఏ మాత్రం మార్పు కనబడలేదు. ఫలితంగా ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పదో రోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాన్ని ఏపీ అధికార, విపక్షాలు వరుసగా పదో రోజు అవిశ్వాసం పెట్టినా.. సభ్యుల గంధరగోళం మధ్య పదో రోజున కూడా అది చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

లోక్ సభలో తొలుత ప్రారంభంకాగానే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఉత్తరాధి రాష్ట్రాల్లోని దళత సంఘాలు భారత్ బంద్ కు పిలుపునివ్వడం.. ఈ క్రమంలో చెలరేగిన అంధోళన కారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఏకంగా 11 మంది దళితులు అసువులు బాసారు. ఈ నేపథ్యంలో అందోళనకారులు నిరసనల మధ్యే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆ ఘటనలపై పార్లమెంటులో ప్రకటన చేశారు.

ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు పున:సమీక్షించాలని కేంద్రం ఇప్పటికే రివ్యూ పిటీషన్ దాఖలు చేసిందని ఆయన తెలిపారు. రొండో రోజుకూడా బంద్ కొనసాగుతన్న క్రమంలో అందోళనకారులు శాంతించాలని అయన కోరారు. ఆ వెనువంటనే తన వద్దకు కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాలు వచ్చాయని వాటిపై చర్చ జరగాల్సిన అవసరముందని.. స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. అందోళన చేస్తున్న సభ్యులను తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని కోరారు. అయితే కావేరి నది జలాల బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తూ.. వెల్ లోకి దూసుకువచ్చి నినాదాలు చేయడంతో.. అమె సభను వాయిదా వేశారు.

రాజ్యసభలో మాత్రం కొంత సేపు సభ సజావుగానే సాగింది. గత నెలలో పలు రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడిన రాజ్యసభ సభ్యుల చేత చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, తృణముల్ కాంగ్రెస్, అధికార బీజేపి, జేడీయు సహా పలు పార్టీల నుంచి కొందరు రాజ్యసభ సభ్యులు రాజ్యసభకు మరోమారు ఎన్నుకోబడగా, మరికొందరు మాత్రం కొత్తగా రాజ్యసభలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. అయితే ప్రమాణ కార్యక్రమం ముగియగానే అన్నాడీఎంకే పార్టీ ఎంసీలు వెల్ లోకి దూసుకువచ్చి అందోళన చేయడంతో చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles