మానవత్వంతో కూడిన రాజకీయాలే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాయాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పవన్ అనంతరం ఎంబీ గార్డెన్స్లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
నావి ఓటు బ్యాంకు రాజకీయాలు కావు.. రాజకీయాలతోనే సామాజిక మార్పు వస్తుందన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశాడు. తనను ప్రేరేపించిన బలమైన కారణాల్లో నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా ఓ కారణమని పవన్ ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం రాజకీయాల్లోకి ఉడుకు నెత్తురుతో మరుగుతున్న యువత కావాలి. సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోకుండా రాజకీయాల్లో మార్పుల తీసుకురాలేం. దేశంలో కులాలు అంతం కావాలని, తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయాల మార్పుపై దృష్టి సారించాలని అన్నారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు అవసరం. ఆ ఆశయ సాధనతోనే జనసేన ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. తనపై దాడి చేసినా.. విమర్శించిన భరిస్తానన్న పవన్... మానవత్వ రాజకీయాల కోసం ఎందాకైనా వెళ్తానని చెప్పారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా రూపు మాపేవరకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకాగా.. వారిని ఉద్దేశించి పవన్ పలు సూచనలు చేశారు. సమస్యలను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లండి. సాంఘిక సంక్షేమ హస్టళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయండి. తెలంగాణలో ప్రజలు అభివృద్ధి చెందాలంటే పార్టీలన్నీ సమిష్టి కృషి అవసరం. అందుకే అందరినీ కలుపుకుని ముందుకెళ్దాం. మన భాష మన యాసను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ఫీల కోసం కాకుండా సమస్యలపై పోరాడాలని.. అంబేద్కర్,పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పవన్ కోరారు. విగ్రహాల ఆరాధన కంటే.. ఆశయాల సాధన కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇక విమర్శలపై స్పందిస్తూ... ప్రభుత్వాల సాయం తీసుకోదల్చుకుంటే తనకు అమరావతిలో పార్టీ ఆఫీసు ఏర్పాటుకు సమస్యలే ఎదురయ్యేవి కావు కదా అని పవన్ తెలిపారు. తనది లెఫ్ట్-రైట్ వింగ్ కాదని.. ప్రజల ప్రక్షమని.. సమస్యలు ఎక్కడుంటే తాను అక్కడ చేరి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని కుండ బద్ధలు కొట్టాడు. ఇక తనతో కలిసి వస్తే తెలంగాణ సమస్యలను చూపిస్తానని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు పవన్ చురకలంటించాడు. కాంగ్రెస్ హైకమాండ్ గనుక వీహెచ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను అందుకు సిద్ధమని పవన్ తెలిపారు. ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని అడ్డుకోవటం ఎవరి వల్లా కాదన్న పవన్.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతూ సెలవు తీసుకున్నారు.
చివర్లో ఓ మహిళ పవన్ కి అభినందనలు తెలియజేసేందుకు వేదిక మీదకు చేరే యత్నంలో.. పవన్ ఆమెను గమనించి స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఆపై ఆమె పాదాలకు అభివాదం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక వికలాంగ అభిమానులు పవన్ ను పలకరించగా.. ఆయన అప్యాయంగా అక్కున్న చేర్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more