బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలా ప్రసాద్ యాదవ్ పై నమోదైన దాణా కుంభకోణం కేసులో తీర్పును వెలువరించేందుకు ముందుకు సంబంధిత రాంఛీ సీబిఐ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అయితే ఈ ఫోన్ కాల్స్ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన న్యాయమూర్తుల నుంచే వచ్చాయన్న కథనాలు మరింత కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన యోగీ అధిత్యనాథ్ సర్కార్.. విచరాణ కమిటినీ ఏర్పాటు చేసింది. నిజానిజాలను వెలికి తిసి నివేదికను తమకు సమర్పించాలని అదేశించింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్ జిల్లా న్యాయమూర్తి మనన్ అక్తర్ తో పాటు, సబ్ డివిజినల్ న్యాయమూర్తి కూడా కలసి రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్ సింగ్ తో తీర్పు వెలువరించిక ముందే ఫోన్లో సంబాషించారని వార్తలు వచ్చాయి. అర్జేడి అధినేత లాలూకు విధించే శిక్ష విషయంలో తాము చెప్పినట్లు చేయాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఇద్దరు.. శివపాల్ ను బెదిరించారంట. ఇదే విషయాన్ని శివపాల్ మీడియా దృష్టికి తీసుకెళ్లటంతో సంచలనంగా మారింది.
పత్రికలలో ప్రముఖంగా ప్రచురించిన ఈ వార్తలను ప్రభుత్వం సిరీయస్ గా తీసుకుంది. రంగంలోకి దిగిన యోగీ అధిత్యనాథ్ సర్కార్ ఈ యావత్ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ వార్తను ఆదిత్యానాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ధృవీకరించారు. వీలైనంత త్వరలో ఈ ఘటనపై నివేదికను అందజేస్తానని ఝాన్సీ కమిషనర్ అమిత్ గుప్తా వెల్లడించారు.
మాకేం తెలీదు... ఆరోపణలపై ఇద్దరు న్యాయమూర్తులు స్పందించారు. శివపాల్ సింగ్ చెబుతున్నట్లు తాము బెదిరింపులకు పాల్పడలేదని వారంటున్నారు. జలౌన్లోని ఓ భూవివాదానికి సంబంధించి శివపాల్తో తాము చర్చించినట్లు సబ్ డివిజినల్ న్యాయమూర్తి చెబుతుండగా.. జిల్లా న్యాయమూర్తి మన్నన్ అక్తర్ మాత్రం అసలు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు.
I never talked to him (Shivpal Singh) over phone. He must issue a statement, if it happened. On the date mentioned in reports, I was in my home town, on a leave.: Mannan Akhtar, Jalaun DM on reports of him calling Special Court Judge Shivpal Singh for Lalu Yadav on #FodderScam pic.twitter.com/X920OtaQJO
— ANI UP (@ANINewsUP) January 11,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more