దేశ స్వాతంత్య్రానికి పూర్వం నుంచి బ్రిటీష్ కాలం వరకు కూడా వెనకబడిన తరగతుల జాబితాలో వున్న కాపులకు స్వాతంత్ర్య తరువాత అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి అగ్రవర్ణ జాబితాలో చేర్చారని దానిని గుర్తించి కాపులకు అండగా నిలవాలని తమ ప్రభుత్వం వారిని వెనకబడిన తరుగతుల జాబితాలోకి చేర్చుతూ ఇవాళ అసెంబ్లీలో బిల్లును పాస్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలని కాపులెవరూ తనను అడగలేదని కూడా స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గత మూడున్నరేళ్ల క్రితం తాను చేసిన పాదయాత్ర సందర్భంగా కాపు సామాజికవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి తానే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాపులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ హామీ ఇచ్చానని చెప్పారు. దానిని అమలు చేసేందుకు అధికారంలోకి వచ్చి రాగానే మంజునాథ కమీషన్ కూడా వేశామని చెప్పారు. కాపుల అభ్యున్నతికి కట్టుబడి వున్నామని, అందుకనే వారి ప్రత్యక బోర్డును ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్ల నిధులను కూడా కేటాయిస్తున్నామని చెప్పారు.
అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. రాష్ట్ర జనాభాలో కాపులు 8.72 శాతం ఉన్నారని తెలిపారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలన్నీ కలిపి 11 శాతం ఉన్నారని చెప్పారు. బ్రిటీష్ కాలంలో కాపులకు రిజర్వేషన్ ఉండేదని... ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రిజర్వేషన్లను తొలగించారని తెలిపారు. 2016లో కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేశామని చెప్పారు.
ఇతర బీసీలకు అన్యాయం జరగకుండా కొత్తగా 'బీసీ ఎఫ్' ను ఏర్పాటు చేస్తున్నామని... 4 నుంచి 5 శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని కమిషన్ సూచించగా, 5 శాతానికే మొగ్గు చూపామని చంద్రబాబు తెలిపారు. బీసీలు లేకుండా తెలుగుదేశం పార్టీనే లేదని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తామని... కేంద్రం దీన్ని షెడ్యూల్ 9లో చేర్చి అమలు చేయాలని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more