ఓ వైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛాభారత్ అన్న నినాదంతో బోజనానికి ముందు చేతులు పరిశుభ్రం చేసుకోవాలని దేశప్రజలకు పిలుపునిస్తుంటే.. విద్యార్థులను స్వచ్ఛాభారత్ బాటలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ.. విద్యార్థులు ఎప్పుడు.. ఎక్కడ ఏ ప్లేటులో బోజనం చేసినా.. తాము ఎదుర్కోన్న ఘటనను తలచుకుంటే చాలు డోకు వచ్చేలా మారిందీ పరిస్థితి. అసలేం జరిగింది..? అంటే..
మధ్యప్రదేశ్, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... అక్కడి ఉపాధ్యాయులు పిల్లల పట్ల దారుణంగా వ్యవహరించారు. ప్రతి రోజు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు పాఠశాల టాయిలెట్స్ క్లీన్ చేయించారు. ఇంటికెళ్లిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులు చేయించిన పని గురించి వారి తల్లిదండ్రులతో చెప్పారు.
దీనిపై అగ్రహోక్తులైన తల్లిదండ్రులు.. టీచర్లను నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా, అప్పటికే వారంతా స్కూలు నుంచి వెళ్లిపోయినట్టు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. దీంతో వారంతా పాఠశాల వద్దకు చేరుకుని క్రితంరోజున ఆందోళన చేపట్టారు. అయితే పిల్లల తల్లిదండ్రుల ఆరోపణలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహాన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని చెప్పారు. పాఠశాలలో ఒకే టాయిలెట్ ఉందని, అలాంటప్పుడు విద్యార్థులతో ఎందుకు క్లీన్ చేయిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై వార్తలువెలువడడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more