దేశవ్యాప్తంగా దసరా పండుగలను హింధువులు ఘనంగా చేసుకుంటారు. మరీ ముఖ్యంగా నవరాత్రులలో నిష్టతో ఉపవాస దీక్షలను అచరించి.. దసరా రోజున వదులుతారు. అయితే దసరా పర్వదినం రోజున మేము కూడా ఘనంగా జరుపుకుంటామని బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు, సిబ్బంది అనడంతో ప్రజలు ఖంగుతింటున్నారు. దసరా సెలవులతో పాటు అదివారం. గాంధీ జయంతి వేడుకలు అన్ని వరుసగా కలసిరావడంతో బ్యాంక్ ఉద్యోగులకు వరుసగా అరు రోజు సెలవులు వచ్చాయి.
దీంతో బ్యాంకులు పనిచేయకపోవడంతో పాటు.. ఏటీయం కేంద్రాలలో నగదు నిల్వలు కూడా తగ్గిపోవడంతో నగదు కొరత ఏర్పడే అవకాశం వుంటుందని ప్రజలు అందోళన చెందుతున్నారు. దసరా పండగ రోజుల ప్రజలకు మరోమారు డీమానిటైజేషన్ రోజులను గుర్తుకు రానున్నాయని పలువురు వ్యంగ వ్యాఖ్యాలు చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మాత్రం కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకోంది. మరీ ముఖ్యంగా కొల్ కతా నగరంలో ఈ అందోళన రేగనుంది.
పండుగతోపాటు నెలాఖరు కావడంతో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఖాతాదారులు ఏటీఎంలలో పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా చేయనున్నారు. అయితే గతేడాది అక్టోబరు 6 నుంచి 12 వరకు బ్యాంకులు మూతపడినా అకౌంట్లలో వేతనాలు వచ్చేందుకు పెద్ద సమస్యగా అవతరించలేదని, అయితే ఈ సారి మాత్రం వేతనాల వచ్చే నెల అందుకోవాల్సి రావడం.. దీంతో అందరూ ఒకేసారి ఏటీయం కేంద్రాల నుంచి నగదు విత్ డ్రా చేయడంతో నగదు కోరత సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు వున్నాయని వేతన జీవులు అంగలార్చుతున్నారు.
అయితే పండుగల వేళ, ఆ తరువాత వేతన జీవుల విత్ డ్రాల సమస్యలను పరిగణలోకి తీసుకుని ఏటీఎం కేంద్రాలలో నగదు నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల అధికారులు ప్రకటించారు. బ్యాంకు అధికారులు చెప్పినట్లు జరుగుతుందో.. లేక మరోమారు గతేడాది కేంద్రం చేపట్టిన డీమానిటైజేషన్ పరిస్థితులను ఉత్పన్నం కాకున్న.. ఆ పాత రోజులను మళ్లీ గుర్తుకు తెస్తుందో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more