ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో తన తొలి ప్రసంగాన్ని వినిపించిన పాకిస్థాన్ ప్రధాని షహీద్ ఖకాన్ అబ్బాసీ భారత్ కోల్డ్ స్టార్ట్ యుద్ధ విధానం, కాశ్మీర్ లో వేర్పాటువాదలను ఎలా అణిచివేస్తుందన్న అంశాలను ప్రస్తావించిన నేపథ్యంలో ధాయాధికి భారత్ కూడా ధీటైన జవాబునిచ్చింది. కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి ఓ ప్రత్యేక దూతను ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ కార్చిన మొసలి కన్నీరును భారత్ పటాపంచలు చేస్తూ వాస్తవిక దృశ్యాలను ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచం ముంగిట బట్టబయలు చేసింది. పాకిస్థాన్ ఇప్పుడు ఒక పరిపూర్ణ ఉగ్రవాద దేశమని భారత్ అభివర్ణించింది. పాకిస్తాన్ ఇక టెర్రరిస్థాన్ అని నినదించింది.
అగ్రరాజ్యంపై కుట్రలు పన్ని కుతంత్రంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను కూల్చిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు తమ దేశంలో అశ్రయమిచ్చిన పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితికి వచ్చి తాము రాసుకున్న కథలను వినిపించే ప్రయత్నం చేసినా.. నిజాలు దాగవని స్పష్టం చేసింది. లాడెన్ అబోట్టాబాద్ లో అమెరికా దళాలు మట్టుబెట్టింది నిజం కాదా..? అని ప్రశ్నించింది. ఒకప్పుడు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్.. ఇప్పడు పరిపూర్ణ ఉగ్రవాద దేశంగా బాసిల్లుతుందని ఐక్యరాజ్య సమితిలోని భారత తొలి సెక్రటరీ ఈనమ్ గంభీర్ అన్నారు.
పాకిస్థాన్ అంటే స్వచ్ఛమైన భూమన్న అర్థాన్ని కస్తా ఇప్పుడు అ దేశం మార్చివేసిందన్నారు.. స్వచ్చమైన భూమి కాస్తా.. ఇప్పుడు స్వచ్ఛమైన ఉగ్రవాద భూమిగా మారిపోయిందని భారత్ బదులిచ్చింది. ఏ దేశానికి చెందిన ఉగ్రవాదులైన తమకు రక్షణగా నిలిచే పాకిస్థాన్ కు వచ్చి తలదాచుకుంటున్నారని అరోపించింది. ఉగ్రవాదులకు స్వర్గధామంలా నిలవడమే కాకుండా ఇక ఉగ్రవాదులను తయారు చేస్తుందని, వారిని ప్రపంచ దేశాల ఉగ్రవాద సంస్థలకు కూడా పంపుతుందని భారత్ కార్యదర్శి ఈనమ్ గంభీర్ అన్నారు.
#WATCH:In response to Pak PM Abbasi's address at #UNGA,India says World doesn't need lessons on democracy & human rights from a failed state pic.twitter.com/RsvJmgOM9L
— ANI (@ANI) September 22, 2017
ఇక తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల నేతలకు రాజకీయ నేతలుగా మార్చి వారికి రక్షణ కూడా కల్పిస్తుందని దుయ్యబట్టారు. ఇందుకు లష్కరే తోయిబా నేత, భారత మోస్టు వాంటెండ్ జాబితాలో వున్న హఫీజ్ మహమ్మద్ సయీద్ ను ఉదాహరణగా పేర్కోన్నారు. తాను త్వరలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని గత కొంత కాలం క్రితం ఆయన చేసిన ప్రకటనలను కూడా భారత్ ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువచ్చింది.
చేతిలో తుపాకులు పట్టుకుని పట్టపగలు ఉగ్రవాదులు యదేశ్చగా వీధుల్లో విహరిస్తుంటే తమ దేశంలోని సాధారణ ప్రజానికమే ఎక్కడ ఏప్పడు ఏం జరుగుతుందోనని భయాందోళనలోకి జారుకుంటున్నా.. వారికి భయాన్ని దూరం చేయాల్సిన పాకిస్తాన్ ప్రభుత్వం.. తన దృష్టిని మాత్రం నిత్యం పోరుగు దేశంపైనే పెట్టడం విడ్డూరమని విమర్శించింది. కాశ్మీర్ లో అల్లర్లను సృష్టించేందుకు తమ ఉగ్రవాదులను నిత్యం చోరబాట్లకు ప్రేరేపిస్తున్న పాక్.. అందుకోసం వందల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తూ.. మాట మాట్లాడితే మానవ హక్కుల గురించి ప్రసంగాలు చేయడం విచిత్రంగా వుందని.. తమ దేశంలో లేని ప్రజాస్వామ్య విలువల గురించి పాక్ గగ్గోలు పెడితే.. వినే తిరిక ప్రపంచానికి లేదని ధ్వజమెత్తింది. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో భూభాగమే అని, ఇది పాక్ అర్థం చేసుకుని మసులుకోవాలని ఈనం గంభీర్ హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more