ఎంఐఎం పార్టీ శాసనసభాఫక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్న కేసులో నలుగురు నిందితులను నాంపల్లి క్రిమినల్ కోర్టు దోషులగా నిర్ధారించింది. 2011 ఏఫ్రిల్ 30న చంద్రాయణ గుట్ట కేశవగిరిలోని బార్కస్-బాలాపూర్ రోడ్డులో అభివృద్ది కార్యక్రమాల కోసం వచ్చిన ఎమ్మెల్యే అక్భరుద్దీన్ పై మాటు వేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ పహిల్వాన్ ను న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసింది. అతనితో పాటు ఈ కేసులో నిందితులుగా వున్న మరో 10 మందిని కూడా నిర్ధోషులుగా పరిగణించింది.
ఈ కేసులో మొత్తంగా నలుగురిని హసన్ బిన్ ఒమర్ (ఏ2), అబ్దుల్లా (ఏ3), వాహిద్ (ఏ5), వహ్లాన్ (ఏ12)లను దోషులుగా నిర్ధారించింది. ఈ నలుగురు దోషులకు పదేళ్ల పాటు జైలు శిక్షను విధించింది. దీంతో పాటు నలుగురు నిందితులకు పది వేల రూపాయల జరమానా కూడా విధించింది. ఈ కేసులో మొత్తం 14 మందిపై కేసు నమోదు చేయగా నలుగురిని మాత్రమే దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. నాంపల్లిలోని 7వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులొ న్యాయమూర్తి జస్టిస్ టి.శ్రీనివాస రావు ఇవాళ ఈ కేసు తుది తీర్పును వెలువరించారు.
తుది తీర్పు నేపథ్యంలో న్యాయస్థానం వద్ద కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ ఘటనలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గన్ మెన్ తో పాటుగా గన్ మన్ జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు మరణించారు. దీంతో ఈ కేసులో మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చి దర్యాప్తు చేసిన సిసీసీఎస్ పోలీసులు వేగంగా దర్యాప్తును చేపట్టారు. వీరందరీపై న్యాయస్థానంలో అభియోగపత్రాలను సమర్పించారు. దీంతో విచారించిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెలువరించి.. దోషులకు పదివేల రూపాయల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more